09/11/2025
సాగునీరు, తాగునీరు కోసం రోడ్లు మరియు విద్యా, వైద్యం ఇతర మౌలిక సదుపాయాలు కల్పన కోసం పెద్ద తుంబలం గ్రామం నుండి సిపిఎం పాదయాత్ర ప్రారంభం.
మెలిగనూరు దగ్గర తుంగభద్ర నదిపై వరద కాలువ నిర్మించి
కౌతాళం మరియు ఆదోని మండలాల రైతాంగానికి సాగునీరు అందించాలని కోరుతూ *సిపిఎం ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం పెద్ద తుంబలం నుండి పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్రను సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే వెంకటేశులు, గ్రామ మాజీ సర్పంచ్ డి కృష్ణమూర్తి జండా ఊపి ప్రారంభించారు**
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదోని కౌతాళం మండలాలు సాగునీరు లేక పూర్తిగా వెనకబడ్డాయని పక్కనే తుంగభద్ర నది ఉన్నప్పటికీ ఈ మండలాల్లో రైతాంగానికి సాగునీరు అందించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని ఈ సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు వందల టీఎంసీల నీరు తుంగభద్ర నది గుండా వృధాగా పారిపోయిందని, ఈ నీటిని నిలుపుదల చేసుకోవడానికి మేలిగనూరు దగ్గర వరద కాలువ నిర్మాణం చేపట్టాలని కౌతాళంలో రెండు రిజర్వాయర్లు ఆదోని మండలంలో మూడు రిజర్వాయర్లు నిర్మించి ఈ రెండు మండలాల రైతాంగానికి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
అలాగే చాలా గ్రామాల్లో త్రాగడానికి నీళ్లు లేక ప్రజానీకం చాలా ఇబ్బందులు పడుతున్నారని ఈ మండలాల్లో ప్రజానీకానికి త్రాగునీరు అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై ఉందని ఇందుకోసం గ్రామాల్లో త్రాగునీటి సమస్య పరిష్కారానికి రెండు మండలాల్లో అదనపు ఎస్ఎస్ ట్యాంకులు లేదా ఎస్ఎస్ ట్యాంకులను పైప్ లైన్లు వేసి త్రాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కూటమీ ప్రభుత్వం సాగునీరు త్రాగునీరు సమస్యల పరిష్కారానికి దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.
రెండు మండలాల్లో రోడ్ల సమస్య కూడా తీవ్రంగా ఉన్నదని రోడ్లు సరిగా లేక ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ ప్రమాదాల బారి నుండి ప్రజలను కాపాడడానికి వెంటనే రోడ్లు బాగు చేయాలని అలాగే గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
అలాగే ఆరెకల్ దగ్గర నిర్మించిన మెడికల్ కాలేజీని ప్రభుత్వమే నిర్వహించాలని అందరికీ వైద్యం అందించాలని ఆదోనిలో డిగ్రీ కాలేజ్ ప్రభుత్వ భవనాన్ని నిర్మించాలని ఈ డిమాండ్ల సాధన కోసం సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్ర మరియు నవంబర్ 10వ తేదీన ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా నిర్వహిస్తున్నామని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కౌతాళం మండలం సీనియర్ నాయకులు కే మల్లయ్య, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి లింగన్న, కౌతాళం మండల కన్వీనర్ ఈరన్న, ఆదోని మండల కార్యదర్శి వర్గ సభ్యులు డి రామాంజనేయులు, ఉచ్చిరప్ప, జి రామాంజనేయులు, మండల నాయకులు, కే పాండురంగ, అయ్యప్ప, బాషా, హనుమంత్ రెడ్డి, తిక్కప్ప, అయ్యన్న, శాఖా కార్యదర్శులు గోవిందు అనీఫ్ బాషా, పరమేష్, దస్తగిరి భాషా, రంగన్న పార్టీ సభ్యులు లక్ష్మన్న హనుమంత్ రెడ్డి, తాయన్న, రామలింగప్ప వీరేష్, చిరంజీవి, హుసేని నర్సిరెడ్డి, కాజా, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.