CPM ADONI

CPM ADONI పొలిటికల్ పార్టీ

17/03/2026

ప్రభుత్వ అనుమతులు లేకుండా రంగురంగుల కాగితాలు, రాళ్లతో ప్రజలను ఆకర్షిస్తున్న అక్రమ వెంచర్ల పై చర్యలు తీసుకోవాలి....సిపిఎం......ఆదోని.
పట్టణం లోని విస్తరిస్తున్న తరుణంలో ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు రంగురంగుల కాగితాలు ముద్రించి ప్రజలను మభ్యపెడుతూ ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ఆకర్షణీయమైన వెంచర్లు వేస్తూ వ్యాపారం చేస్తున్న వెంచర్ల యజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు గోపాల్, తిప్పన్న, మండల కార్యదర్శి లింగన్న, మున్సిపల్ కమిషనర్ నయీమ్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం వీరు మాట్లాడుతూ పట్టణంలోని నలుమూలలో ప్రభుత్వ అనుమతులు లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తు కొత్త కొత్త వెంచర్లు ఎస్టేట్ల పేర్లతో విచ్చలవిడిగా వ్యాపారం చేస్తున్న సంబంధిత అధికారులు చూసి చూడనట్లుగా ఉంటున్నారని వారు తెలిపారు. దీంతో పట్టణంలో నిత్యం కబ్జాల పేరుతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని వారు తెలిపారు .కావున ఇప్పటికైనా సంబంధం అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వ అనుమతులు లేకుండా పట్టణంలో అక్రమ వెంచర్లు వేసి ధనార్జన దేయంగా ప్రజలను మభ్యపెడుతున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము.

15/02/2026

#రాష్ట్ర #బడ్జెట్లో #కర్నూలు #జిల్లాకు #తీవ్ర #అన్యాయం... #సిపిఎం.... #ఆదోని.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో కర్నూలు జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. రాష్ట్ర బడ్జెట్లో పత్తాలేని జిల్లా ప్రాజెక్టులు, కేటాయింపులు చేసిన వాటికి అంతంత మాత్రమేనిధులు, హైకోర్టు బెంచ్, ఆదోని మెడికల్ కళాశాల, కర్నూలు జిజిహెచ్ లాంటి వాటికి ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం తీవ్ర అన్యాయమని జరిగిందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేశులు, సీనియర్ నాయకులు ఈరన్న తెలిపారు. ఆదోని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా శ్రీనివాస్ భవన్ సర్కిల్ నందు సిపిఎం పట్టణ మండల, కార్యదర్శిలు లక్ష్మన్న, లింగన్న ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమం ఉద్దేశించి సిపిఎం నాయకులు వెంకటేశులు, ఈరన్న వీరు మాట్లాడుతూ బడ్జెట్లో జిల్లాకు మళ్ళీ మొండిచేయి చూపారు దీనికి కూటమి ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలని వారు తెలిపారు. బడ్జెట్లో జిల్లాకు ఎటువంటి ప్రత్యేక బడ్జెట్ కేటాయించలేదని వారు అన్నారు. ప్రాజెక్టుల నిర్వహణ కోసం కేవలం రూ 479 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారని వారు గుర్తు చేశారు. అభివృద్ధి కోసం గానీ, కర్నూలు జిల్లాలో పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం గానీ, పరిశ్రమల కోసం ప్రత్యేక నిధులు కానీ, ఎక్కడ బడ్జెట్లో లేకపోవడం కూటమి ప్రభుత్వం జిల్లాకు నిర్లక్ష్యం చేస్తూ వచ్చిందని వారు తెలిపారు. జిల్లా ప్రజలు చాలా ఆశతో ఈసారైనా సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం కోసం నిధులు కేటాయించి వలసలు నివారిస్తారని ఆశించిన ప్రజల ఆశలు అడియాశలు అయ్యాయని వారు తెలిపారు. కర్నూలు జిల్లాలో కూటమి ప్రభుత్వానికి మంచి మెజార్టీ ఇచ్చినప్పటికీ ఈ ప్రాంతాన్ని విస్మరించడం సరైనది కాదని వారు తెలిపారు. ప్రధానంగా ఆదోని మెడికల్ కళాశాల ఉసే లేదని వారు తెలిపారు. కావున ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి బడ్జెట్ సవరణ చేస్తూ కర్నూలు జిల్లాకు నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు గోపాల్ తిప్పన్న, వీరారెడ్డి, వీరేష్, వెంకటేష్,నాగరాజు, తిక్కప్ప, నాగేంద్ర, కృష్ణమూర్తి, వీరేష్, సూరి, తదితరులు పాల్గొన్నారు.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) CPI(M)* ఆదోని మండలం.   తేదీ:24/12/2025గౌరవనీయులైన MPP గారికి  ఆదోని మండలం.విషయం* ...
24/12/2025

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) CPI(M)* ఆదోని మండలం.
తేదీ:24/12/2025
గౌరవనీయులైన MPP గారికి
ఆదోని మండలం.
విషయం* : ఇటీవలనే రాష్ట్ర ప్రభుత్వం
46 రెవెన్యూ గ్రామాలతో అతిపెద్ద మండలం గా ఉన్న ఆదోని మండలాన్ని రెండుగా చేస్తూ 17 గ్రామాలతో పెద్ద హరివణం మండల కేంద్రాన్ని విభజిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
పెద్ద హరివాణం మండల కేంద్రానికి సుమారుగా20 - 30 కిలోమీటర్లు దూరంలో ఉన్న గణేకల్లు,చాగి, కడితోట, నారాయణపురం, నాగనాతనహళ్లి దాణాపురం ,జి హోసళ్ళి,బసాపురం, మదిరే, గ్రామాలు పెద్ద హరివాణం లో కలపడం వల్ల రవాణా మరియు రాకపోకలకు చాలా ఇబ్బంది కలుగుతుంది.అలాగే దగ్గరగా ఉన్న గ్రామాలు సంతేకుడ్లురు, చిన్న హరివణం, చిన్న గోనెహాల్ గ్రామాల్లో కూడా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.ప్రభుత్వం తక్షణమే పెద్దహారివాణం మండలంలో విలీనం చేసిన గ్రామాలలో గ్రామసభలు నిర్వహించి మండలంగా ప్రకటించాలని గతంలో సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది.
ఆదోని మండలం విభజన ఆశాస్త్రీయంగా జరిగిందని, స్థానిక ప్రజల మరియు ప్రజాప్రతినిధులతో ఎలాంటి సంప్రదింపులు జరుపుకుండా మండలాన్ని విభజించడం వల్ల ప్రజలు గందరగోళంలో ఉన్నారని, ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. *ప్రభుత్వం పునరాలోచన చేసి ఈ గ్రామాలకు అందుబాటులో ఉన్న ఆదోనిలోనే కొనసాగించాలని కోరుతున్నాము. మండల సర్వసభ్య సమావేశం తీర్మానం చేసి జిల్లా కలెక్టర్ గారికి పంపాలని కోరుతున్నాము* ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కే లింగన్న మండల కార్యదర్శి వర్గ సభ్యులు బి వీరారెడ్డి, మండల కమిటీ సభ్యులు పాండురంగ, తిక్కప్ప, నారాయణపురం శాఖ కార్యదర్శి తాయన్న, మదిరే సిపిఎం పార్టీ సీనియర్ నాయకుడు చిన్న తిక్కన్న పాల్గొన్నారు.

అభివందనములతో
CPM పార్టీ మండల కమిటీ
ఆదోని మండలం.

09/11/2025
సాగునీరు, తాగునీరు కోసం రోడ్లు మరియు విద్యా, వైద్యం ఇతర మౌలిక సదుపాయాలు కల్పన కోసం పెద్ద తుంబలం గ్రామం నుండి సిపిఎం పాదయ...
09/11/2025

సాగునీరు, తాగునీరు కోసం రోడ్లు మరియు విద్యా, వైద్యం ఇతర మౌలిక సదుపాయాలు కల్పన కోసం పెద్ద తుంబలం గ్రామం నుండి సిపిఎం పాదయాత్ర ప్రారంభం.
మెలిగనూరు దగ్గర తుంగభద్ర నదిపై వరద కాలువ నిర్మించి
కౌతాళం మరియు ఆదోని మండలాల రైతాంగానికి సాగునీరు అందించాలని కోరుతూ *సిపిఎం ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం పెద్ద తుంబలం నుండి పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్రను సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే వెంకటేశులు, గ్రామ మాజీ సర్పంచ్ డి కృష్ణమూర్తి జండా ఊపి ప్రారంభించారు**
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదోని కౌతాళం మండలాలు సాగునీరు లేక పూర్తిగా వెనకబడ్డాయని పక్కనే తుంగభద్ర నది ఉన్నప్పటికీ ఈ మండలాల్లో రైతాంగానికి సాగునీరు అందించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని ఈ సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు వందల టీఎంసీల నీరు తుంగభద్ర నది గుండా వృధాగా పారిపోయిందని, ఈ నీటిని నిలుపుదల చేసుకోవడానికి మేలిగనూరు దగ్గర వరద కాలువ నిర్మాణం చేపట్టాలని కౌతాళంలో రెండు రిజర్వాయర్లు ఆదోని మండలంలో మూడు రిజర్వాయర్లు నిర్మించి ఈ రెండు మండలాల రైతాంగానికి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
అలాగే చాలా గ్రామాల్లో త్రాగడానికి నీళ్లు లేక ప్రజానీకం చాలా ఇబ్బందులు పడుతున్నారని ఈ మండలాల్లో ప్రజానీకానికి త్రాగునీరు అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై ఉందని ఇందుకోసం గ్రామాల్లో త్రాగునీటి సమస్య పరిష్కారానికి రెండు మండలాల్లో అదనపు ఎస్ఎస్ ట్యాంకులు లేదా ఎస్ఎస్ ట్యాంకులను పైప్ లైన్లు వేసి త్రాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కూటమీ ప్రభుత్వం సాగునీరు త్రాగునీరు సమస్యల పరిష్కారానికి దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.
రెండు మండలాల్లో రోడ్ల సమస్య కూడా తీవ్రంగా ఉన్నదని రోడ్లు సరిగా లేక ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ ప్రమాదాల బారి నుండి ప్రజలను కాపాడడానికి వెంటనే రోడ్లు బాగు చేయాలని అలాగే గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
అలాగే ఆరెకల్ దగ్గర నిర్మించిన మెడికల్ కాలేజీని ప్రభుత్వమే నిర్వహించాలని అందరికీ వైద్యం అందించాలని ఆదోనిలో డిగ్రీ కాలేజ్ ప్రభుత్వ భవనాన్ని నిర్మించాలని ఈ డిమాండ్ల సాధన కోసం సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్ర మరియు నవంబర్ 10వ తేదీన ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా నిర్వహిస్తున్నామని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కౌతాళం మండలం సీనియర్ నాయకులు కే మల్లయ్య, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి లింగన్న, కౌతాళం మండల కన్వీనర్ ఈరన్న, ఆదోని మండల కార్యదర్శి వర్గ సభ్యులు డి రామాంజనేయులు, ఉచ్చిరప్ప, జి రామాంజనేయులు, మండల నాయకులు, కే పాండురంగ, అయ్యప్ప, బాషా, హనుమంత్ రెడ్డి, తిక్కప్ప, అయ్యన్న, శాఖా కార్యదర్శులు గోవిందు అనీఫ్ బాషా, పరమేష్, దస్తగిరి భాషా, రంగన్న పార్టీ సభ్యులు లక్ష్మన్న హనుమంత్ రెడ్డి, తాయన్న, రామలింగప్ప వీరేష్, చిరంజీవి, హుసేని నర్సిరెడ్డి, కాజా, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

06/11/2025

కల్లుబావిలో స్మశాన వాటికకు రక్షణ గోడ,
మంచినీటి సమస్య పరిష్కారం కొరకు ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించాలనీ ఈనెల 10వ తేదీ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు జరుగు ధర్నాను జయప్రదం చేయండి..., సిపిఎం...
ఆదోని పట్టణ సమస్యలు పరిష్కరించాలని, ఆదోని సమగ్రాభివృద్ధి కొరకు ఈనెల 10వ తేదీ ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం జరుగు మహాధర్నాను జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కల్లుబావిలో పాదయాత్ర నిర్వహించడం జరిగింది. పాదయాత్ర ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేశులు, పట్టణ కార్యదర్శి లక్ష్మన్న, వీరు మాట్లాడుతూ ప్రధానంగా కల్లుబావి స్మశాన వాటికకు కల్లుబావి, శంకర్ నగర్, ప్రకాష్ నగర్, భాస్కర్ రెడ్డి కాలనీ, వైయస్సార్ కాలనీ, భీమ్ రెడ్డి కాలనీ ప్రజలకు ఇది ఒకటే స్మశాన వాటిక ఉంది.అయితే ప్రస్తుతం స్మశాన వాటికకు రక్షణ గోడ లేకపోవడంతో రాత్రి వేళలో కుక్కలు, పందులు స్మశానం లో ఉన్న శవాలను బయటకు తీసుకొచ్చి చుట్టుపక్కల ఉన్న ఇళ్ల మధ్యలో వదిలేసి వెళ్లడం జరుగుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు భయాందోళన గురవుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారు తెలిపారు. అలాగే స్మశాన వాటికకు వెళ్లి వచ్చిన తర్వాత కనీసం కాళ్లు (శుభ్రం చేసుకోవడానికి)కడుక్కోవడానికి కూడా నీటి సౌకర్యం లేదు.కావున స్మశాన వాటికకు రక్షణ గోడ, రోడ్డు నీటి సౌకర్యము,విశ్రాంతి షెడ్డు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా భాస్కర్ రెడ్డి కాలనీ నందు మంచినీటి సమస్య, డ్రైనేజీ సమస్య పరిష్కరించాలనీ వారు తెలిపారు. శంకర్ నగర్ దగ్గర ఉన్న వంకకు రక్షణ గోడ నిర్మించి, రోడ్డు సౌకర్యం కల్పించాలి. బీసీ కాలనీ, ప్రకాష్ నగర్ నందు స్త్రీల మరుగుదొడ్ల సమస్యను పరిష్కారం చేయాలి. అదేవిధంగా శంకర్ నగర్ లో ఉన్న ఎస్సీ కాంప్లెక్స్ మరమ్మత్తు పనులు చేపట్టి, మహిళలకు ఉపాధి శిక్షణ కేంద్రంగా మార్చాలనీ వారు డిమాండ్ చేశారు . ఈ ప్రాంతంలో మంచి నీటి సమస్య పరిష్కారం కొరకు ఓహెర్ హెడ్ ట్యాంక్ నిర్మించాలని వారు డిమాండ్ చేశారు.పై సమస్యల పరిష్కారం కొరకు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 15వ తేదీ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు జరుగు మహాధర్నాను ప్రజల అధిక సంఖ్యలో పాల్గొవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు గోపాల్, ముక్కన్న, తిప్పన్న, నాయకులు నాగరాజు, కృష్ణమూర్తి, మల్లయ్య, మనోహర్,రామదాసు, ఉరుకుందు మరియు కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

 #సాగునీరు, #త్రాగునీరు  #కోసం    #పార్టీ  #అధ్వర్యంలో  #పోరాటాలు.  ఆదోని మండలం లో సాగునీరు,త్రాగునీరు, మరియు స్థానిక సమ...
31/10/2025

#సాగునీరు, #త్రాగునీరు #కోసం #పార్టీ #అధ్వర్యంలో #పోరాటాలు.
ఆదోని మండలం లో సాగునీరు,త్రాగునీరు, మరియు స్థానిక సమస్యలపై సీపీఎం పార్టీ అధ్వర్యంలో జీపు యాత్రలు,పాదయాత్రలు నిర్వహిస్తున్నామని ఈ పోరాటాలలో ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాలని CPM పార్టీ జిల్లకార్యదర్శి D గౌస్ దేశాయ్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే.వెంకటేశులు పిలుపు ఇచ్చారు.
తుంగభద్ర నదిపై మెళిగానురు దగ్గర వరద కాలువ నిర్మించాలని,వేదవతి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి ఆదోని మండలానికి సాగునీరు త్రాగునీరు అందించాలని కోరుతూ సుందరయ్య భవన్లో మండల కార్యదర్శి కె లింగన్న అధ్యక్షతన మండల సదస్సు జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదోని మండలంలో LLC ద్వారా కేవలం 4 గ్రామాలు మాత్రమే సాగునీరు అందుతుందని మిగతా 40 గ్రామాలు వర్షం పై ఆధారపడిన మెట్ట పంటలు వేసుకోవడం జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం కురిసిన అధిక వర్షాలు వల్ల పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని, పంట దిగుబడి రాక ధరలు లేక పెట్టిన పట్టుబడి తిరిగి రాక అప్పులు కట్టుకోవడానికి కూలీలతో పాటు రైతులు అందరూ వేరే ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారని,కావున తక్షణమే కూటమి ప్రభుత్వం *తుంగభద్ర నదిపై మేల్గనూరు దగ్గర వరద కాలువ నిర్మించాలని, వేదవతి ప్రాజెక్టు నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే స్థానికంగా నెమలికల్ ఎస్ఎస్ ట్యాంక్ నుండి బసరకోడు వరకు అదనపు పైప్ లైన్, కుప్పగల్లు ఎస్ ఎస్ ట్యాంక్ నుండి పాండవగల్ వరకు అదనపు పైప్ లైన్, చిన్న హరివాణం దగ్గర నిర్మించిన ఎస్ ఎస్ ట్యాంక్ నుండి సంతే కుళ్లూరు పెద్ద హరివాణం వరకు అదనపు పైప్లైన్ వేయాలని డిమాండ్ చేశారు* రోడ్లు మరియు స్మశానవాటికలు, విద్యా వైద్యం మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
నవంబర్ నెలలో ఈ సమస్యల పరిష్కారానికి జీపు యాత్రలు, పాదయాత్రలు నిర్వహించి ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేపడుతున్నట్లు వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. ఉచ్చిరప్ప, జి రామాంజనేయులు మండల కమిటీ సభ్యులు భాష, అయ్యప్ప, హనుమంత్ రెడ్డి, పాండురంగ, అయ్యన్న, తిక్కప్ప, శాఖా కార్యదర్శులు గోవిందు, అనీఫ్ బాషా, రామాంజనేయులు, దస్తగిరి భాషా, పరమేష్, ఆయా గ్రామాల పార్టీ సభ్యులు సాంభూతిపరులు తదితరులు పాల్గొన్నారు.

29/10/2025

#తుంగభద్ర #నదిపై #మేలిగనూరు #దగ్గర #వరద #కాలువ #నిర్మించాలి #వేదవతి #ప్రాజెక్టు #వెంటనే #పూర్తి #చేయాలి #అక్టోబర్ #31న #సదస్సును #జయప్రదం #చేయండి.

కౌతాళం మండలం మేలిగినూరు దగ్గర తుంగభద్రా నదిపై వరద కాలువ నిర్మించాలని, ఆదోని మండలంలోని కొండలలో ఇస్వి, సుల్తానాపురం, కపటి చెరువులను నింపాలని,తక్షణమే వేదవతి ప్రాజెక్టు పనులు ప్రారంభించి *ఆదోని మండలానికి సాగునీరు మరియు త్రాగునీరు అందించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అక్టోబర్ 31వ తేదీన అదొనిలోని సుందరయ్య భవన్ లో జరిగే సదస్సును జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కే లింగన్న మండల కార్యదర్శి వర్గ సభ్యులు డి రామాంజనేయులు ఎం. ఉ చ్చిరప్ప, ఒక ప్రకటనలో తెలియజేశారు.
ఆదోని మండలంలో సారవంతమైన భూములు ఉన్నప్పటికీ సాగునీరు లేక రైతుల కేవలం వర్షాధారంపై ఆధారపడి పంటలు పండిస్తున్నారని వర్షాకాలం ముగిసిన వెంటనే కూలీలతో పాటు రైతులకు కూడా వేరే ప్రాంతాలకు వలసలు వెళుతున్నారని, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి రైతులకు సాగునీరు అందించాలని వారు డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో సాగునీటి ప్రాజెక్టుల కోసం జరిగే పోరాటానికి ఆదోని మండలంలోని ప్రజాప్రతినిధులు రైతులు కూలీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే వెంకటేశ్వర్లు హాజరవుతున్నట్లు వారు తెలిపారు.

Address

Adoni
518301

Website

Alerts

Be the first to know and let us send you an email when CPM ADONI posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category