26/12/2022
భారత కమ్యూనిస్ట్ పార్టీ CPI,98 వ,వ్యవస్థపాక దినోత్సవం సందర్బంగా అనంతపురం జిల్లా సమితి ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ నుండి, టవర్ క్లాక్ సర్కిల్, సప్తగిరి సర్కిల్,గాంధీ బజార్,తాడిపత్రి బస్టాండ్,నీలం మీదుగా CPI జిల్లా కార్యాలయం వరకు 500 వందలు మంది,జనసేవాదల్ కార్యకర్తలు కవాతు నిర్వహించారు,ఈ కార్యక్రమం ప్రారంబానికి ముందుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కామ్రేడ్ దేవరగుడి జగదీశ్ టవర్ క్లాక్ సర్కిల్ లో
పతాక ఆవిష్కరణ చేసి,జెండా వందనం స్వీకరించారు,ఈ సందర్బంగా జగదీశ్ మాట్లాడుతూ
కమ్యూనిస్ట్ పార్టీ 98 సంవత్సరాల కాలంలో,ఎనలేని త్యాగాలు చేసిందన్నారు,వెట్టి చాకిరీ విముక్తి కోసం,బడుగు బలహీన అణగారిన,వెనుక బడిన
సామాజిక వర్గాల పక్షాన చారిత్రాత్మక పోరాటాలు చేసిందాన్నారు,దేశ సమైక్యత,సమగ్రత,కోసం,దేశంలో అల్ప సంఖ్యాక వర్గాల హక్కుల పరిరక్షణ కోసం,మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ ఏనలేలి పోరాటాలు చేసిందన్నారు,సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ మాట్లాడుతూ కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందాన్నారు, అనంతపురం జిల్లాలో MLA లు,అక్రమ వసూళ్ళ కారణంగా వచ్చిన కంపెనీలు కూడ మూట ముళ్ళు సర్దుకోని పోయాయాని ఆరోపించారు,MLA తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుల దౌర్జన్యలను,అడ్డుకుంటే మా పార్టీ నాయకుల పైన దాడులు చేస్తున్నారన్నారు,దాడులను ప్రతిఘటిస్తామన్నారు,ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు నారాయణ స్వామి, మల్లికార్జున,నగర కార్యదర్శి శ్రీరాములు, జిల్లా కార్యవర్గ సభ్యులు,జిల్లా సమితి సభ్యులు,AITUC, AIYF, AISF, NFIW, BKMU,AIKSS, ఇతర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు