27/12/2015
ఉప్పల్ నుండి యాదాద్రికి మెట్రో రైలు..
హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మెట్రో రైలు వచ్చే ఏడాది మొదలు కానున్న విషయం తెలిసిందే. ఇక ఈ మెట్రోను ఉప్పల్ నుండి నేరుగా యాదగిరి గుట్ట వరకు పొడిగించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే ఈ ప్రయత్నాలు మొదలయ్యాయని, ఓ ఎకరం స్థలం కూడా సేకరించడం జరిగిందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్ నగరంలో ఇప్పటికి దాదాపు 63 శాతం పనులు పూర్తయ్యాయని, సుల్తాన్ బజార్ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను పూర్తిగా పరిష్కరించామని, పాత అలైన్ మెంట్ ప్రకారమే మెట్రో పనులు జరుగుతాయని ఎన్వీఎస్ రెడ్డి వివరించారు. మొత్తానికి యాదాద్రికి హైస్పీడ్ మెట్రో రైల్ ఏర్పాటు చేయడం అన్నది శుభ పరిణామం. దీనిని కేసీఆర్ మరో అధ్భుతంగా చెప్పక తప్పదు.