Real Estate

Real Estate CEO - Marketing in Landmark |Expertise in the Real Estates in Leadership

📢 Special Offer: Book a Flat and Earn Monthly Rental Income! 🏢💰Are you looking for a smart investment opportunity? Now’s...
16/10/2024

📢 Special Offer: Book a Flat and Earn Monthly Rental Income! 🏢💰

Are you looking for a smart investment opportunity? Now’s your chance to own a flat and enjoy guaranteed monthly rental income with zero hassle!

Why Choose Us?
- Guaranteed Rental Income: Start earning from Day 1!
- Flexible Payment Plans: Easy EMI options available.
- Prime Locations: Choose from properties in high-demand areas.
- Hassle-Free Management: Let us handle everything, from tenant screening to property maintenance.

Limited Time Offer!
Invest in a flat today and secure steady monthly income without the stress of property management. Whether you're a seasoned investor or a first-time buyer, this is the perfect way to make your money work for you.

For further information please contact +91 - 8919916405

హైదరాబాద్ లో భారీగా పెరిగిన ఇళ్ల ధరలు..!తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోయిందని ప్రచారం జరుగుతోంది. కానీ ...
27/09/2024

హైదరాబాద్ లో భారీగా పెరిగిన ఇళ్ల ధరలు..!

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోయిందని ప్రచారం జరుగుతోంది. కానీ భాగ్యనగరంలో ఇళ్ల ధరలు పెరిగినట్లు ఓ నివేదిక బయట పెట్టింది. హైదరాబాద్‌తో పాటు మరో ఆరు నగరాల్లో కూడా ధరలు పెరిగాయని రియల్ ఎస్టేట్ సేవల సంస్థ అనరాక్ (ANAROCK) పేర్కొంది. ఆరు సిటీలతో పోలిస్తే హైదరాబాద్‌లో అత్యధిక పెరుగుదల కనిపించిందని వివరించింది. 2024 రెండో త్రైమాసికంతో పోలిస్తే, 2024 మూడో త్రైమాసికంలో ధరలు నాలుగు శాతం పెరిగాయని తెలిపింది.

అయితే 2023 క్యూ3 నుంచి 2024 క్యూ3కి హైదరాబాద్‌లో నివాస ప్రాపర్టీ ధరలలో 32 శాతం పెరుగుదల నమోదు అయినట్లు వివరించింది. ఇది దేశంలోని మొదటి ఏడు నగరాల్లో అత్యధికమని పేర్కొంది. హైదరాబాద్ లో రెండో త్రైమాసికంలో స్క్వేర్ ఫీట్ కు రూ.6,900 ఉండగా.. మూడో త్రైమాసికంలో రూ.7,150 పెరిగింది. చెన్నైలో క్యూ2లో స్క్వేర్ ఫీట్ కు రూ.6,500 ఉండగా క్యూ3 లో 6,680కి చేరింది. బెంగళూరులో క్యూ2లో రూ.7,800.. క్యూ3లో 8,100 చేరింది.

పెరుగుతున్న ఖర్చులతో టాప్ ఏడు నగరాల్లో సగటు నివాస ఇళ్ల ధరలు 23 శాతం పెరిగాయని నివేదిక పేర్కొంది. హైదరాబాద్, ఇతర అగ్ర నగరాల్లో నివాస ప్రాపర్టీ ధరలు పెరగడంతో గృహాల అమ్మకాలు క్షీణించాయని వివరించింది. కోల్‌కతాలో అమ్మకాలలో అత్యధిక క్షీణత కనిపించింది. 2023 మూడో త్రైమాసికం నుంచి Q3 2024 వరకు 25 శాతం తగ్గాయని తెలిపింది. విక్రయాల్లో హైదరాబాద్‌ రెండో అత్యధిక క్షీణత నమోదు చేసినట్లు పేర్కొంది.

కల్ కత్తాలో అమ్మకాలు Q3 2023లో 16,375 యూనిట్లు అమ్ముడవగా.. Q3 2024లో 12,735 యూనిట్లు అమ్ముడయ్యాయి. హైదరాబాద్ లో అమ్మకాలు క్షీణించడానికి హైడ్రా కూడా కారణమని పలువురు చెబుతున్నారు. చాలా వరకు కట్టడాలు చెరవుల బఫర్, ఎఫ్టీఎల్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో చాలా ఇళ్ల కొనుగోలుకు వెనకాడుతున్నారు.

19/09/2024

Looking for seriously working Real Estate team leaders...
Contact
Y K Rao
Sr Director
Srigdha Group Projects
+918919916405

ఇదే సరైన టైం.. హైదరాబాద్‌లో ఇల్లు, భూమి ఇప్పుడే ఎందుకు కొనాలంటే?హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా స్థిరాస్తి రంగం వచ్చే పదేళ్...
16/09/2024

ఇదే సరైన టైం.. హైదరాబాద్‌లో ఇల్లు, భూమి ఇప్పుడే ఎందుకు కొనాలంటే?

హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా స్థిరాస్తి రంగం వచ్చే పదేళ్లలో మరింత విస్తరిస్తుందని నైట్ ఫ్రాంక్ ఇండియా, క్రెడాయ్ నివేదికలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిమాణం 482 బిలియన్ డాలర్లు ఉండగా.. అంది 2034 నాటికి 1.5 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. అంటే రానున్న రోజుల్లో గృహ నిర్మాణాలకు, ఆఫీసులకు, గెస్ట్ హౌస్‌లకు మంచి డిమాండ్ ఉంటుందని అర్థమవుతోంది. జనాభా పెరగడం, నగరాలకు వసలు, ఆదాయాలు పెరగడమే ఇందుకు కారణంగా నిపుణులు చెబుతున్నారు. సాధారణంగానే మార్కెట్లలో హెచ్చుతగ్గులు ఉంటాయని, ఇల్లు, స్థలాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయమని స్థిరాస్తి రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటి నుంచే అన్వేషన ప్రారంభిస్తే దసరా నాటికి నచ్చిన ఇల్లు లేదా భూమి కొనొచ్చంటున్నారు.

రియల్ ఎస్టేట్‌లో కొద్ది మంది మాత్రమే పెట్టుబడి పెడుతుంటారు. చాలా మంది సొంత అవసరాల కోసం కొనుగోలు చేస్తుంటారు. ఇల్లు, విల్లాలు, ఫ్లాట్లు, భవిష్యత్తు కోసం వెంచర్లలో స్థలాలు కొంటారు. ఇవన్నీ దీర్ఘకాలిక అవసరాలు. అందుకే మార్కెట్లతో సంబంధం లేకుండా స్తబ్దుగా ఉన్నప్పుడే కొనుగోలు చేస్తే మంచిదంటున్నారు నిపుణులు. మార్కెట్ స్తబ్దుగా ఉన్నప్పుడు డెవలపర్‌తో బేరమాడేందుకు అవకాశం లభిస్తుందని, రాత్రికి రాత్రే ధరలు పెంచే పరిస్థితులు ఉండవంటున్నారు. ఇలాంటి మార్కెట్ స్తబ్దుగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కొనడం ద్వారా కాస్త ధర తగ్గించేందుకు, పేమెంట్లు చేసేందుకు గడువు ఇచ్చేందుకు అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం మార్కెట్ స్తబ్దుగా ఉందంటే ముందు ముందు ధరలు పెరుగుతాయని అంచనా వేయవచ్చని చెబుతున్నారు. అలాంటి పరిస్థితులు రాకముందే కొనుగోలు చేయాలంటున్నారు.

అలాగే ఫ్లాట్లు, విల్లాలు మాత్రమే కాకుండా వెంచర్లలోనూ స్థలాలు కొనేందుకు ఇది ఒక మంచి సమయం అని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు. ప్రభుత్వం కొత్తగా మౌలిక వసతులు ఎక్కడ ఏర్పాటు చేయనుంది, భవిష్యత్తులో వృద్ధికి అవకాశం ఉన్న స్థలాలు గుర్తిస్తూ నిపుణుల సలహాలు తీసుకుని కొనుగోలు చేయాలి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ప్రభుత్వాలు మారిన సందర్భాల్లో కొంత కాలం పాటు మార్కెట్ అనేది స్తబ్దుగానే ఉంటుంది. ఆ తర్వాత ఒక్కసారిగా పెరిగిన దాఖలాలు ఉన్నాయి. ఈ ధోరణి 2000 సంవత్సరం నుంచి చూడవచ్చు. 2005లో తెలంగాణ ఉద్యమం సమయంలో, కరోనా వచ్చిన సమయంలో మార్కెట్ తగ్గి ఆ తర్వాత ఒక్కసారిగా పుంజుకుంది. ఇప్పుడున్న పరిస్థితులను గమనిస్తే వచ్చే 6-12 నెలల్లో బాగా పుంజుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. స్థిరాస్తుల ధరలు పెరిగే అవకాశం ఉన్నందున ఇప్పుడే కొనుగోలు చేయండ మేలంటున్నారు.

మీ ఫ్లాట్ ఎఫ్ టి ఎల్ లో ఉందా..? అయితే ఎలా చెక్ చేసుకోండి.కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎఫ్టిఎల్, బఫర్ జోన్లకు తిలోదకాల...
12/09/2024

మీ ఫ్లాట్ ఎఫ్ టి ఎల్ లో ఉందా..? అయితే ఎలా చెక్ చేసుకోండి.

కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎఫ్టిఎల్, బఫర్ జోన్లకు తిలోదకాలు ఇచ్చి వ్యాపారం చేశారు. లేక్ వ్యూ, లేక్ ఫ్రెండ్ అంటూ కొత్త మార్కెటింగ్ సృష్టించి లాభాలు పొందారు. జల వనరుల కాపాడాల్సిన అధికార యంత్రాంగాన్ని ఏమార్చి ఎన్వోసీల పేరిట దగా చేశారు. దాంతో చెరువులో కొండలు ఉనికికే ప్రమాదం ఏర్పడింది. భారీ వరదలు వస్తే ఆ వరద ఎక్కడికి వెళ్లాలో అంతుచిక్కక కాలనీ కాలనీలను ముంచిత్తుతున్నది. దీంతో చెరువులను రక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సాహసోపేతం నిర్ణయం తీసుకున్నారు హైడ్రాను స్థాపించి జల వనరులను సంరక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ స్థలం ఇల్లు ఎఫ్ఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉందో లేదో తెలియక ఆందోళన సామాన్యులు కనిపిస్తున్నది. కొత్తగా కొనుగోలు చేయాలనుకునే వారికి సైతం అనేక అనుమానాలు వెంటాడుతున్నాయి. అసలు బఫర్ జోన్ అంటే ఏంటి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

⭐ చెరువు నిండితే ఎక్కడ దాకా నీళ్లు వస్తాయో అదే ఫుల్ ట్యాంక్ లెవెల్ (ఎఫ్ టి ఎల్) వాటర్ స్టోరేజీ సామర్థ్యాన్ని బట్టి చెరువు చుట్టూ ఉంటుంది.
⭐ ఎఫ్ టి ఎల్ కి ఓవైపు కొంతమేరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా ఉండేందుకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం బఫర్ జోన్లను నిర్దేశించారు. ఇది ఎఫ్టిఎల్ నాలా సైజుని బట్టి ఉంటుంది.
⭐ నాళాలు చెరువుల మ్యాప్ల్లో ఎఫ్టీఎల్ బౌండరీస్ చూపిస్తారు. బఫర్ జోన్ కి కూడా అక్షాంశాలు రేఖాంశాలతో కూడిన వివరాలు ఉంటాయి. విలేజ్ మ్యాప్ లో రెవెన్యూ సర్వే నెంబర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఇరిగేషన్ రెవెన్యూ రూల్ బుక్ ప్రకారం చేస్తారు.
⭐ చెరువు, కుంట, శిఖం భూములు బఫర్ జోన్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు.
⭐ హెచ్ఎండిఏ, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ పరిధిలో నదులకు ఇరువైపులా కనీసం 50 మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దు.
⭐ పది హెక్టార్లు లేదా 25 ఎకరాలకు పైగా ఉండే చెరువులు, కుంటలకు 30 మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది. 9 మీటర్ల కెనాల్/నాలా వరద కాలువ ఉంటుంది.
⭐ పది హెక్టార్ల కంటే తక్కువగా ఉండే చెరువులు కుంటలకు కనీసం 9 మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది. రెండు మీటర్ల కెనాల్/ నాలా వరద కాలువ ఉంటుంది.

ఎలా తెలుసుకోవాలి?

హెచ్ఎండిఏ పరిధిలో చెరువు విస్తీర్ణం ఎఫ్.టి.ఎల్ బఫర్ జోన్ వంటి అన్ని వివరాలు తెలుసుకునేందుకు స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.
https://lakes.hmda.gov.in వెబ్సైట్ కి వెళ్ళాలి. అందులో జిల్లా మండలం గ్రామం సెలెక్ట్ చేసుకోవాలి ఆ ఊర్లోని అన్ని చెరువులు వివరాలు వస్తాయి.

05/09/2024
టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు: రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలుయాదగిరిగుట్ట(యాదాద్రి) శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయ...
02/09/2024

టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు: రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

యాదగిరిగుట్ట(యాదాద్రి) శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయ అభివృద్ధిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. 'స్పీడ్' ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశానికి సీఎస్‌ శాంతి కుమారి, మంత్రి జూపల్లి కృష్ణారావు, పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ రమేశ్‌ రెడ్డి తదితరులు హాజరయ్యారు. హెల్త్, ఎకో, టెంపుల్ టూరిజం అభివృద్ధిపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి నూతన విధానం రూపొందించాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. ఇతర రాష్ట్రాల్లోని ఉత్తమ విధానాలను అధ్యయనం చేయాలని, ఎకో, టెంపుల్ పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. హెల్త్‌ టూరిజంను అభివృద్ధి చేయాలన్న రేవంత్‌ రెడ్డి.. హైదరాబాద్ బయట మరో జూపార్క్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.

మరోవైపు, యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని తెలిపారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిలో పెండింగ్ పనుల వివరాలు ఇవ్వాలని, భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా చేపట్టాల్సిన చర్యలపై వివరాలు సమర్పించాలన్నారు. ఆలయ రాజగోపురానికి బంగారు తాపడం పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులను అర్ధాంతరంగా ఆపవద్దని స్పష్టం చేశారు. వైటీడీఏ, యాదగిరిగుట్టకు సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు.

Regional Ring Road: ఫోర్త్‌ సిటీకి అనువుగానే..రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) దక్షిణ భాగం అలైన్‌మెంట్‌ తెలంగాణ రాష్...
30/08/2024

Regional Ring Road: ఫోర్త్‌ సిటీకి అనువుగానే..

రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) దక్షిణ భాగం అలైన్‌మెంట్‌ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పరి రక్షించే విధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. నూతనంగా ఏర్పడనున్న ఫోర్త్‌ సిటీలో నెలకొల్పనున్న పరిశ్రమలకు, వాటిలో పనిచేసే అధికారులు, సిబ్బందికి.. వారి కుటుంబాలకు విద్యా, వైద్య, ఇతర వసతులు అందుబాటులో ఉండేలా అలైన్‌మెంట్‌ ఉండాలని సూచించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగం, రేడియల్‌ రోడ్ల నిర్మాణం, డ్రైపోర్ట్‌ను సీ పోర్ట్‌కు అనుసంధానించే గ్రీన్‌ ఫీల్డ్‌ రహదారిపై ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి బుధవారం సాయంత్రం అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.

ఈ మేరకు సీఎం కార్యాలయం మీడియాకు ప్రకటన విడుదల చేసింది. గత వారం జరిగిన సమీక్షలో ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగం అలైన్‌మెంట్‌లో ముఖ్యమంత్రి పలు మార్పులు సూచించడంతో అధికారులు దానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేశారు. అయితే ఆ అలైన్‌మెంట్‌లో కొన్ని తేడాలు ఉండటంతో మరి కొన్ని మార్పులను సూచించారు. ఆ మార్పులకు అనుగుణంగా అలైన్‌మెంట్‌ మార్చాలని... అది ఫైనల్‌ అయ్యాక వెంటనే కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు.

ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి రీజినల్‌ రింగ్‌ రోడ్డు వరకు నిర్మించాలనే ప్రతిపాదిత రేడియల్‌ రోడ్ల ప్రాంతంలో ముందుగానే భూసేకరణ చేయాలని సూచించారు. రహదారులు, ఇతర అభివృద్థి పనులకు భూ సేకరణ చేస్తున్నపుడు మానవీయ కోణంతో ఆలోచించాలని, భూ నిర్వాసితులతో సానుభూతితో వ్యవహరించాలని సూచించారు. నిబంధనల మేరకు సాధ్యమైనంత ఎక్కువ పరిహారం ఇవ్వడంతో పాటు ప్రభుత్వ పరంగా అదనంగా ఏవిధమైన సాయం చేయగలమన్న అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు.

హైదరాబాద్ లో అక్కడ గజం రూ.10లక్షలు.. ఎక్కడంటే?మీరు చదివింది అక్షరాల నిజం. ఒక గజం ధర ఎంత ఉంటుంది? అంటే.. ఎవరికి వారు వారి...
29/08/2024

హైదరాబాద్ లో అక్కడ గజం రూ.10లక్షలు.. ఎక్కడంటే?

మీరు చదివింది అక్షరాల నిజం. ఒక గజం ధర ఎంత ఉంటుంది? అంటే.. ఎవరికి వారు వారికి తోచిన లెక్క చెప్పొచ్చు. కానీ.. ఎవరూ కూడా రూ.10 లక్షలు ఉంటుందని మాత్రం చెప్పలేరు. అయితే.. హైదరాబాద్ మహానగరంలోని ఒక ప్రాంతంలో గజం రూ.10లక్షల చొప్పున 101 గజాల స్థలాన్ని ఏకంగా రూ.10 కోట్లకు అమ్మిన వైనం సంచలనంగా మారింది. ఇప్పటివరకు హైదరాబాద్ లో ఎకరం రూ.వంద కోట్లుగా విన్నాం. కానీ.. గజం రూ.10 లక్షలు మాత్రం విన్నది లేదు. ఈ సరికొత్త రికార్డుకు కేరాఫ్ అడ్రస్ బేగంబజార్ నిలిచింది.
హైదరాబాద్ మహానగరంలో అన్ని రకాల హోల్ సేల్ వ్యాపారాలకు నెలవుగా ఉండే బేగంబజార్ లో ఈ తాజా క్రయ ఒప్పందం జరిగినట్లుగా తెలుస్తోంది. పాతబస్తీ పరిధిలోని బేగంబజార్ ఫీల్ ఖానాలోని 101 గజాల స్థలాన్ని రూ.10 కోట్లకు కొనుగోలు చేసిన వ్యాపారి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో తెలంగాణలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా బేగంబజార్ గా మారింది.

తెలుగు రాష్ట్రాల్లోని హోల్ సేల్ వ్యాపార మార్కెట్లకు బేగం బజార్ అడ్రస్ గా చెబుతారు. వాణిజ్య మార్కెట్ లో దేశ ఆర్థిక రాజధాని ముంబయితో పోటీ పడే సత్తా బేగంబజార్ సొంతం. ఈ ప్రాంతంలోమహారాష్ట్ర.. గుజరాత్.. రాజస్థాన్.. ఉత్తరప్రదేశ్.. మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ఉంటారు. ఈ బజార్ లో కొనుగోళ్ల కోసం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు.. కర్ణాటక రాష్ట్రాల నుంచి వస్తుంటారు.

ఇక్కడ.. భూమి ఉన్న వారు.. సొంత నివాసాలు ఉన్న వారిలో అత్యధికులు తమ ఆస్తుల్ని అమ్మేందుకు సుతారం ఇష్టపడరు. దీంతో.. ఆస్తులకు భారీ డిమాండ్ ఉంది. ఎంతకైనా కొనేస్తామన్నట్లుగా ఉంటుంది. ఈ కారణంగానే.. తాజా రికార్డు కొనుగోలు సాధ్యమైందని చెబుతున్నారు. ఈ ప్రాంతం మొత్తంలో ఉత్తరాది వారిదే అధిక్యతగా చెప్పాలి. వ్యాపార వర్గాలు భారీగా ఉండే.. ఈ ప్రాంతంలో రానున్నరోజుల్లో ధరలు మరిన్ని రికార్డులను నమోదు చేయటం ఖాయమని చెబుతున్నారు.

https://www.tupaki.com/latest-news/land-rate-in-hyderabad-1381739

హైదరాబాద్‌లో ఆ ప్రాంతాలపైనే అందరి చూపు.. ఇంటి స్థలం కొంటే బంగారుమయమే!దేశంలోని పెద్ద నగరాలకు ధీటుగా హైదరాబాద్ వేగంగా అభివ...
24/08/2024

హైదరాబాద్‌లో ఆ ప్రాంతాలపైనే అందరి చూపు.. ఇంటి స్థలం కొంటే బంగారుమయమే!

దేశంలోని పెద్ద నగరాలకు ధీటుగా హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. విశ్వనగరంగా అవతరిస్తోంది. భాగ్యనగరంలో ఉపాధి కోసం వచ్చే వారు ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. హైదరాబాద్ నగరం అన్ని రకాల సౌకర్యాలకు నెలవుగా ఉంది. జనాభా పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం సైతం అందుకు తగ్గట్లుగానే మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. నగర శివార్లలోనూ మెరుగైన రవాణా ఏర్పాటు చేస్తోంది. రంగారెడ్డి జిల్లాలోని ముచ్చర్లలో కొత్త నగరం నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలే ప్రకటన చేశారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలోని భూములకు ఫుల్ డిమాండ్ పెరిగింది. అంతే కాదు హైదరాబాద్ నలు మూలల నగర శివార్లపై ఇప్పుడు భూముల కొనుగోలుదారుల చూపు పడిందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు దాటి నగరం విస్తరిస్తోంది. ప్రభుత్వం సైతం అక్కడి వరకు రవాణా సౌకర్యాలు కల్పిస్తోంది. రహదారుల విస్తరణతో ప్రతి 10 నిమిషాలకు ఒక సిటీ బస్సు శివార్ల నుంచి సిటీకి వస్తోంది. ఎంఎంటీఎస్ రైళ్లు సైతం పరుగులు పెడుతున్నాయి. దీంతో శివారు ప్రాంతాలు నగరానికి ఎంతో చేరువయ్యాయి. ఒకప్పుడు మేడ్చల్ వెళ్లాలంటేనే చాలా దూరం అనే వారు. ఇప్పుడు అది సిటీలో ఒక భాగమైపోయింది. అదే విధంగా ఘట్‌కేసర్, ఉందానగర్ ప్రాంతాలు సైతం ఒక్కప్పుడు సిటీకి చాలా దూరం అనుకునే వారు. కానీ ఇప్పుడు అక్కడి వరకు సిటీ విస్తరిస్తోంది. భూముల ధరలకు రెక్కలొచ్చాయి. అయినప్పటికీ నగరంలోని ధరలతో పోలిస్తే అందుబాటులోనే ఉండడంతో నగర శివారు ప్రాంతాల్లో ఇంటి స్థలాలు కొనుగోలు చేసేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. తమకు అనువైన ప్రాంతాలపై దృష్టి సారిస్తున్నారు.

రియల్​ ఎస్టేట్​ బిజినెస్ పెరుగుతుందా? తగ్గుతుందా?- వచ్చే ఆరునెలల్లో ఏం జరుగుతుందంటే! రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం స్థానికతపై...
21/08/2024

రియల్​ ఎస్టేట్​ బిజినెస్ పెరుగుతుందా? తగ్గుతుందా?- వచ్చే ఆరునెలల్లో ఏం జరుగుతుందంటే!

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం స్థానికతపైనే ఎక్కువగా ఆధారపడినా ఈ రంగంపై రాష్ట్ర, దేశ ఆర్థిక, రాజకీయ నిర్ణయాలు అంతిమ ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయ భౌగోళిక, ఇతర పరిణామాల ప్రభావం కూడా రియల్​ రంగంపై అధికంగా ఉంటోంది. ప్రభుత్వ వర్గాల్లో మార్పులు, రాజకీయ, బడ్జెట్‌ సంబంధిత నిర్ణయాలతో ఏర్పడిన అనిశ్చితి నేపథ్యంలో రియల్​ ఎస్టేట్​ రంగం పయనమెటు అనే సందేహం సర్వత్రా వ్యక్తమవుతోంది. మరింత జాగ్రత్తతో కూడిన విధానాన్ని మార్కెట్‌ ప్రతిబింబించినట్లు నైట్‌ ఫ్రాంక్, నరెడ్కో సెంటిమెంట్‌ సర్వేలు వెల్లడించాయి.

హైదరాబాద్​లో భూమి ధర అక్కడే ఎక్కువ - జూబ్లీహిల్స్, గచ్చిబౌలి కాదు - High land cost in Hyderabad

రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని జాతీయ స్థాయిలో పోల్చి చూస్తే ప్రస్తుత సెంటిమెంట్‌ ఇండెక్స్‌ స్కోరు, భవిష్యత్తు సెంటిమెంట్‌ స్కోరు ఒకేలా నమోదయ్యాయి. ఈ రెండు ఫలితాలు ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 65గా నమోదయ్యాయి. ఈ స్కోరు వందకు చేరువగా ఉంటే రియల్​ రంగం చాలా సానుకూలంగా ఉన్నట్లు చెప్పుకోవచ్చు. స్కోరు తగ్గుతున్నా కొద్దీ సెంటిమెంట్‌ అంత బలంగా లేనట్లు భావించాల్సి ఉంటుందంటున్నారు ఆ రంగానికి చెందిన నిపుణులు. మొదటి త్రైమాసికంలో 72గా ఉన్న స్కోరు రెండో త్రైమాసికంలో 65కి తగ్గిపోవడంపై ఆందోళన చెందాల్సిన పనిలేదని, మరింత జాగ్రత్తగా ఉంటూ ఆశావాదం వైపు మారడాన్ని సూచిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. 65 స్కోరూ సానుకూలమే, 50 ఉంటే తటస్థం, అంతకంటే ఎక్కువ ఉంటే సానుకూల భావాన్ని తెలియజేస్తుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ప్రపంచ భౌగోళిక, రాజకీయ పరిణామాల నేపథ్యంలో కీలక సూచీలన్నీ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం, సానుకూతను వెల్లడిస్తున్నాయి. దీంతో ఇళ్లు, అపార్ట్​మెంట్లు, ఆఫీస్​ స్పేస్​ మార్కెట్‌లలో స్థిరమైన వృద్ధిని సర్వే అంచనా వేస్తోంది.

బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఏమంటున్నాయంటే!

రియల్​ రంగం అభివృద్ధిపై డెవలపర్లు సానుకూల ధోరణితో ఉన్నారు. డెవలపర్లు కాని భాగస్వాములైన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, పీఈ ఫండ్స్‌ సంస్థల అభిప్రాయం కూడా అనుకూలమే. వీరిచ్చిన స్కోరు 68ని పరిశీలిస్తే ఇంకా ఎక్కువ విశ్వాసంతో ఉన్నారని తెలుస్తోంది. ఈ స్కోరు తొలి త్రైమాసికం 73తో పోలిస్తే తగ్గినప్పటికీ ఆశావహ ఫలితాలను చూపుతోంది.

ధరలు పెరుగుతాయని..

వచ్చే ఆరునెలల్లో స్థిరాస్తుల ధరలు పెరుగుతాయని బిల్డర్ల అంచనా. అత్యధికంగా 63 శాతం మంది బిల్డర్లు స్థిరాస్తుల ధరలు పెరుగుతాయని అంచనా వేశారు. ధరలు నిలకడగానే ఉంటాయని 36 శాతం మంది చెబితే.. తగ్గుతాయని చెప్పింది కేవలం ఒక్కశాతమే. విక్రయాలు పెరుగుతాయని 51 శాతం మంది, కొత్త ప్రాజెక్టుల ప్రారంభాలు ఉంటాయని 61 శాతం మంది తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. 2019 ఎన్నికల తర్వాత సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఉన్నదని గుర్తు చేస్తూ భవిష్యత్తుపై ఆశావహ దృక్పథాన్ని వెల్లడించారు.

రాజకీయ, ఆర్థిక పరిణామాల నేపథ్యంలో మార్కెట్‌ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. స్వల్పకాలిక సవాళ్లు ఎదుర్కొని అభివృద్ధి చెందడానికి ఉన్న అన్ని అవకాశాలను మార్కెట్​ గమనిస్తోంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో సహా డెవలపర్లు, కీలక భాగస్వాములు సానుకూల దృక్పథాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తుపై బలమైన విశ్వాసంతో ఉన్నాం.

Address

LB Nagar
Hyderabad
500068

Website

Alerts

Be the first to know and let us send you an email when Real Estate posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category