Indian Real Estate

Indian Real Estate We strive hard to provide world class solutions for buying and selling of agricultural property which meet to the client’s requirements ....!

10/01/2026

ఫ్యూచర్ సిటీ పేరుతో దేశంలోనే ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలన్నది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. న్యూయార్క్, లండన్, టోక్యో, సియోల్, దుబాయ్ లాంటి ప్రపంచ నగరాలతో పోటీ పడాలన్న ప్రభుత్వ ఆకాంక్షకు అనుగుణంగా పెట్టుబడులతో ముందుకు రావాలని పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానం పలికారు.

✅ హైదరాబాద్‌లోని గ్రీన్ బిజినెస్ సెంటర్‌లో జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య (CII) జాతీయ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రి గారు ప్రసంగిస్తూ, పారిశ్రామికాభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడానికి, స్వేచ్ఛా వాణిజ్యం, మార్కెట్లు పనిచేయడానికి పారిశ్రామిక రంగం సహకరించాలని కోరారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అందించడానికి తెలంగాణ రాష్ట్రం సిద్ధంగా ఉందని చెప్పారు.

✅ “తెలంగాణ రైజింగ్ (TelanganaRising) లక్ష్యంతో సేవల రంగం కేంద్రీకృతంగా ఫోర్త్ సిటీని నిర్మించాలన్నది ప్రభుత్వ ఆకాంక్ష. హైదరాబాద్‌లో సంపూర్ణంగా నెట్ జీరో లక్ష్యాలతో పనిచేస్తున్నాం.

✅ హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా మార్చడంలో భాగంగా 3200 ఆర్టీసీ బస్సుల స్థానంలో విద్యుత్ వాహనాలను సమకూర్చబోతున్నాం. ఎలక్ట్రిక్ వాహనాలపై రిజిస్ట్రేషన్, రోడ్ టాక్స్‌లను పూర్తిగా రద్దు చేశాం. ప్రస్తుతం ఎలక్టిక్ వాహనాల అమ్మకాలు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి.

✅ వరదలు లేని నగరంగా, దేశంలోనే పర్యావరణ హితమైన హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో చర్యలు చేపట్టాం. అందులో భాగంగా 55 కిలోమీటర్ల పొడవైన మూసీ పునరుజ్జీవ పనులను ప్రారంభించాం. 2050 నాటికి అవసరమయ్యే తాగునీటి అవసరాలకు అవసరమైన కార్యాచరణను ఇప్పటి నుంచే ప్రారంభించాం.

✅ తెలంగాణ మణిహారంగా రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టాం. అవుటర్ రింగ్ రోడ్డుకు రీజినల్ రింగ్ రోడ్డుకు మధ్యన రేడియల్ రోడ్లను నిర్మించబోతున్నాం. ఆయా ప్రాంతాల్లో ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఈవీ, సోలార్ పవర్ వంటి పరిశ్రమలు అక్కడ ఏర్పాటు చేయబోతున్నాం.

✅ 360 కి.మీ పొడవు ఉండబోయే రీజినల్ రింగ్ రోడ్డు వెంట రీజినల్ రింగ్ రైల్‌ను నిర్మించాలని ప్రధానమంత్రి గారిని కోరాం. రీజినల్ రింగ్ రోడ్ చుట్టూ తయారీ పరిశ్రమ, మార్కెటింగ్ కు అవసరమైన కేంద్రీకృత ప్రదేశాలను ఏర్పాటు చేయాలన్నది మా ఉద్దేశం.

✅ చైనా తరహాలో రకరకాల క్లస్టర్లను సృష్టించాలని భావిస్తున్నాం. ఒక లైట్ సిటీ, మార్బుల్ సిటీ, గ్రానైట్ సిటీ, ఫర్నీచర్ సిటీ... ఇలా ప్రత్యేక తరహాలో రీజినల్ రింగ్ రోడ్డు చూట్టూ మార్కెటింగ్ కార్యకలాపాల విస్తరణకు ప్రయత్నిస్తున్నాం.

✅ రీజినల్ రింగ్ రోడ్ పూర్తయితే తెలంగాణ ప్రాంతంలో 70 శాతం పట్టణీకరణ జరుగుతుంది. రింగ్ రోడ్డు ఆవలివైపున గ్రామీణ తెలంగాణ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా వ్యవసాయం, సేంద్రీయ సాగు, రైతుల కోసం గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది.

✅ తెలంగాణకు సముద్ర తీరప్రాంతం లేని కారణంగా డ్రై పోర్టును ఏర్పాటు చేస్తున్నాం. పోర్టుతో అనుసంధానం చేయడానికి మచిలీపట్నం ఓడరేవు వరకు ప్రత్యేక రహదారి, రైల్వే కనెక్టివిటీని ప్రతిపాదించాం.

✅ నైపుణ్యత పెంచడానికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంపై ప్రధానంగా దృష్టి సారించాం. చైనా ప్లస్ వన్ వ్యూహంలో హైదరాబాద్‌ను ప్రపంచంలో ప్రధాన పెట్టుబడుల కేంద్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.

✅ సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించడం శుభ పరిణామం. అత్యుత్తమ వ్యాపార సౌలభ్యాలను అందించడానికి తెలంగాణ సిద్ధంగా ఉంది. సీఐఐ కలిసిరావాలి. అందరం కలిసి అద్భుతాలు సాధించవచ్చని మా నమ్మకం” అని ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు.

✅ ఈ సమావేశంలో సీఐఐ అధ్యక్షుడు సంజీవ్ పూరి గారు, వైఎస్-ప్రెసిడెంట్ ఆర్. ముకుందన్ గారు, సీఐఐ డైరెక్టర్ చంద్రజీత్ బెనర్జీ గారు, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ గారితో పాటు సీఐఐ ప్రతినిధులు, ఆయా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

06/01/2026

• డబ్బే డబ్బును సంపాదిస్తుంది..!

డబ్బు వృద్ధి చెందాలంటే ఇన్వెస్ట్‌ చేయడం ఒకటే మార్గం. ఇది మనందరికీ తెలుసు. అయితే, పెట్టుబడి విషయంలో అందరూ అనుసరిస్తున్న మార్గాన్ని గుడ్డిగా ఫాలో అయితే ఉపయోగం ఉండదు. మీరు ఎంత వరకు నష్టభయాన్ని భరించగలరో అంచనా వేసుకోవాలి. తదనుగుణంగా మీకు కావాల్సిన రాబడినిచ్చే మార్గాలేంటో చూసుకోవాలి. వాటిలో మదుపు చేయాలి.

25/12/2025
స్థలం కొంటున్నారా...? అప్రమత్తంగా ఉండండిసొంతింటి కోసమనో.. పెట్టుబడి సాధనంగానో చాలామంది స్థలాలను కొనుగోలు చేస్తుంటారు. అవ...
07/12/2025

స్థలం కొంటున్నారా...? అప్రమత్తంగా ఉండండి

సొంతింటి కోసమనో.. పెట్టుబడి సాధనంగానో చాలామంది స్థలాలను కొనుగోలు చేస్తుంటారు. అవగాహన లేక.. దళారుల మాటలు నమ్మి మోసపోతున్నవారెందరో.ఒకే స్థలానికి అనేక రిజిస్ట్రేషన్లు చేయడం, ఒకరికి అమ్మిన స్థలాన్ని మరొకరికి రిజిస్ట్రేషన్‌ చేస్తున్న ఘటనలు వెలుగులోకొస్తున్నాయి.

కేవలం మాటలతోనే....

స్థిరాస్తి వ్యాపారులు తొలుత భూ యజమానితో ధర నిర్ణయం చేసుకున్నాక కొంత మొత్తం చెల్లించి ఒప్పందం చేసుకుంటున్నారు. అనుమతుల్లేకుండానే లేఔట్లు వేసి.. వ్యవసాయ భూమిని ప్లాట్లుగా విభజించి మౌలిక వసతులు కల్పించకుండానే విక్రయిస్తున్నారు. భూయజమాని ద్వారా కొనుగోలుదారులకు నేరుగా రిజిస్ట్రేషన్లు చేయించి తమ ప్రమేయం లేకుండా చూసుకుంటున్నారు. కొనుగోలుదారులు ఇళ్లు కట్టుకోవాల్సి వచ్చినప్పుడు అనుమతుల కోసం ప్రభుత్వ ఫీజుతోపాటు క్రమబద్ధీకరించుకోవడానికి అదనంగా సొమ్ము వెచ్చించాల్సి వస్తోంది. సమస్య వస్తే అటు యజమానులుగానీ, ఇటు స్థిరాస్తి వ్యాపారులుగానీ బాధ్యత తీసుకోవడం లేదు.

స్థలాలు కొనుగోలుకు ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ శ్రీనివాస్‌ పలు సూచనలు చేశారు.

విక్రయదారుడికి స్థలం హక్కులుంటేనే అవి కొనుగోలుదారుడికి బదిలీ అవుతాయి. లేనిపక్షంలో రిజిస్ట్రేషన్‌ చేసినా ఉపయోగం ఉండదు.
30 ఏళ్ల లింకు డాక్యుమెంట్లు తనిఖీ చేసుకుని యాజమాన్య హక్కులను నిర్ధారించుకోవాలి.
1983 నుంచి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు ఉన్నందున వాటిని చూడొచ్చు.

లేఔట్‌కు అనుమతులున్నాయా? ఎప్పుడు.. ఎంత విస్తీర్ణంలో వేశారు? మౌలిక వసతులకు స్థలం కేటాయించారా? ఎంత విస్తీర్ణంలో ప్లాట్లుగా విభజించారో క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలి.
తాకట్టు రిజిస్ట్రేషన్లు ఉన్నాయా? రుణాలు తీసుకున్నారా? ఈసీ ద్వారా తెలుసుకోవాలి.
డాక్యుమెంట్‌లో సూచించినట్టుగా హద్దులున్నాయా? స్థలం అమ్మకందారుని ఆధీనంలోనే ఉందా? స్థానికులతో నిర్ధారించుకోవాలి.

ఒరిజినల్‌ డాక్యుమెంట్లు తప్పనిసరిగా తీసుకుని రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి.

* ఆస్తిని మార్కెట్‌ ధర కంటే తక్కువకు అమ్మాలని ప్రయత్నిస్తే వివాదంలో ఉందని గుర్తుంచుకోవాలి.

-ఈనాడు - అమరావతి


Address

Hyderabad
500084

Alerts

Be the first to know and let us send you an email when Indian Real Estate posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Indian Real Estate:

Share

Category