Kvrinfraa projects

Kvrinfraa projects KVR INFRAA has emerged as one of the front line construction companies in East Godavari. KVR infraa

వాలెట్‌లో భద్రంకార్డులు.. పెన్‌డ్రైవ్‌లు.. బైక్‌ తాళం చెవి.. కరెన్సీ నోట్లు.. కుర్రకారుని నిత్యం అంటిపెట్టుకొని ఉండే వస...
27/04/2017

వాలెట్‌లో భద్రం

కార్డులు.. పెన్‌డ్రైవ్‌లు.. బైక్‌ తాళం చెవి.. కరెన్సీ నోట్లు.. కుర్రకారుని నిత్యం అంటిపెట్టుకొని ఉండే వస్తువులు ఎన్నో. వీటన్నింటినీ జేబు లేదా పర్సులో వేసుకొని వెళ్లాలంటే కష్టం. ఈ ప్రయాస తప్పించడానికే ‘వెసెల్‌ కంపార్ట్‌మెంట్‌ వాలెట్‌’ వచ్చింది. ఇందులో నాలుగు అరలుంటాయి. కార్డులు, కరెన్సీ, తాళాలు.. ఇతర విలువైన వస్తువులు ఏవైనా భద్రంగా దాచుకోవచ్చు. మునివేళ్లతో తాకుతూ అరల్ని మార్చేసుకోవచ్చు. ధర రూ.మూడువేలు.

మాట వినే లైటువార్తలు.. విశేషాలు ఏంటి? పాటలు ప్లే చేయ్‌, ఆకలేస్తోంది పిజ్జా ఆర్డర్‌ ఇవ్వు! ఇలా మీరు ఏదైనా చెప్పగానే ఠక్కు...
27/04/2017

మాట వినే లైటు
వార్తలు.. విశేషాలు ఏంటి? పాటలు ప్లే చేయ్‌, ఆకలేస్తోంది పిజ్జా ఆర్డర్‌ ఇవ్వు!
ఇలా మీరు ఏదైనా చెప్పగానే ఠక్కున పసిగట్టి ఆ పని చేసే అసిస్టెంట్‌ మీకు కావాలా! అయితే ఈ లైట్‌తో అది సాధ్యమవుతుంది. లైటు ఇవన్నీ ఎందుకు చేస్తుంది అని లైట్‌ తీసుకోకండి. ‘జీఈ’కు చెందిన ‘సి’ అనే ఈ ఎల్‌ఈడీ స్మార్ట్‌ ల్యాంప్‌ వెలుగునివ్వడంతో పాటు మీకు సహాయకురాలిగా వ్యవహరిస్తుంది. అంతర్జాలంలో మీకు కావల్సిన వివరాలు తెలపడం, క్రికెట్‌ స్కోరు, ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్‌ లాంటి పనులు దీని ద్వారా చేసుకోవచ్చన్నమాట. మనుషుల మాటలు విని అర్థం చేసుకొని వాటికి తగ్గట్టు స్పందించే సాంకేతిక లైటు ఇది. అలెక్సా, అమెజాన్‌ల వాయిస్‌ కంట్రోల్‌ సాంకేతికతతో పని చేస్తుంది. దీన్ని తొలుత వైఫైతో కనెక్ట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ లైటు అనుబంధ ఆప్‌ను మొబైల్‌లో వేసుకోవాలి. ఆ తర్వాత ఆ రెండింటిని అనుంసంధానం చేసి మీకు కావల్సిన పనులు చేసుకోవచ్చు. మొబైల్‌లోని ఆప్‌తో ఈ లైట్‌ను యాక్సెస్‌ చేయొచ్చు కూడా. ఇటీవల విడుదలైన ఈ సాంకేతిక బల్బు వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ప్రపంచ మార్కెట్‌లోకి వస్తుంది.

చినోస్‌తో చిందేయండిజీన్స్‌ వేసుకెళ్తే కాలేజీ కుర్రాడిలా ఉన్నావని దెప్పిపొడుస్తారనే మొహమాటం. ఫార్మల్‌గా వెళ్దాం అంటే మరీ ...
27/04/2017

చినోస్‌తో చిందేయండి

జీన్స్‌ వేసుకెళ్తే కాలేజీ కుర్రాడిలా ఉన్నావని దెప్పిపొడుస్తారనే మొహమాటం. ఫార్మల్‌గా వెళ్దాం అంటే మరీ పాత మనిషిలా కనిపిస్తామనే భయం. మరెలా? కుర్ర ఉద్యోగులకు ఈ చిక్కు నుంచి బయటపడేదెలా అంటే సమాధానం చినోస్‌.
* చినోస్‌ ప్యాంట్‌లపై ఫార్మల్‌ చొక్కాలు వేసి, దానిపై జాకెట్‌ వేస్తే హుందాగా, స్టైల్‌గా కని పిస్తారు.
* ఈ దుస్తులకు జతగా లోఫర్స్‌ షూస్‌ వేస్తే కుర్రతనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.
* కార్యాలయంలో డ్రెస్‌కోడ్‌ లేకపోతే చినోస్‌తో ప్రయోగాలు చేయొచ్చు. వీటికి జతగా వూలు, కాటన్‌ ఫ్యాబ్రిక్‌ గళ్లచొక్కాలు సౌకర్యవంతంగా, స్టైల్‌గా కనిపిస్తారు.
* పూర్తిగా ఫార్మల్‌గా కనిపించాలనుకుంటే లేతరంగు ప్లెయిన్‌ చొక్కాలకు బ్రోగ్స్‌ (తోలుతో తయారైన షూలు) ధరించండి.
* ఖాకీ రంగు చినోస్‌, లేతరంగు చొక్కాలు, తెలుపు లోఫర్లు... ఎక్కువ మందికి నప్పే, ఇష్టపడే కాంబినేషన్‌.

నిద్రపుచ్చే యాప్‌తెల్లవారేదాకా సినిమాలు... షికార్లు... చాటింగ్‌లతో చెలరేగిపోవడం. బారెడు పొద్దెక్కితేగానీ నిద్ర లేకపోవడం....
27/04/2017

నిద్రపుచ్చే యాప్‌

తెల్లవారేదాకా సినిమాలు... షికార్లు... చాటింగ్‌లతో చెలరేగిపోవడం. బారెడు పొద్దెక్కితేగానీ నిద్ర లేకపోవడం. యూత్‌కిలాంటివి మామూలే. ‘అలాచేస్తే ఆరోగ్యానికి మంచిదికాదు’ అంటే పట్టించుకుంటారా ఈతరం కుర్రకారు? వూహూ... ఇదే విషయాన్ని మన సెల్‌ఫోనే చెబితే? తప్పకుండా వింటారు. Good morning alarm clock అనే యాప్‌తో ఇది సాధ్యమే. ఈ అప్లికేషన్‌ మనం రోజుకు ఎన్నిగంటలు నిద్రపోవాలో చెబుతుంది. ఎన్ని గంటలు నాణ్యమైన నిద్రపోయారో లెక్కలు తీస్తుంది. మనం హాయిగా కునుకు తీయడానికి మంద్రమైన సంగీతం వినిపిస్తుంది. దాని ప్రకారం ఎన్ని గంటలకు మేల్కోవాలో కూడా చెబుతుంది. ప్రయత్నించండి మరి.

20 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమేరా ఫోన్‌ ఇది! ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం యువతలో ఉన్న సెల్ఫీ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ...
27/04/2017

20 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమేరా ఫోన్‌ ఇది!

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం యువతలో ఉన్న సెల్ఫీ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ మొబైల్‌ఫోన్ల తయారీ సంస్థ వీవో ‘వీ5ఎస్‌’ పేరుతో సరికొత్త మొబైల్‌ను విపణిలోకి విడుదల చేసింది. ముందు 20 మెగాపిక్సెల్‌ కెమేరా ఉండటం ఈ ఫోను ప్రత్యేకత. దీని ధర రూ.18,990గా నిర్ణయించారు. మే 6వ తేదీ నుంచి అన్ని రిటైల్‌ స్టోర్లతో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోను అందుబాటులోకి రానుంది.
‘పరిమిత సంఖ్యలో వీవో వీ5ప్లస్‌ను విడుదల తర్వాత ఇప్పుడు మిమ్మల్ని థ్రిల్‌కు గురిచేసే మరో ఫోన్‌తో మీ ముందుకు వస్తున్నాం. ఉత్తమమైన సెల్ఫీ కెమేరా ఫోన్‌గా మార్కెట్‌ను సుస్థిరం చేసుకోవడమే మా లక్ష్యం’ అని వీవో ఇండియా సీఈవో కెంట్‌ ఛెంగ్‌ తెలిపారు.
వీవో వీ5ఎస్‌ ప్రత్యేకతలు
* 5.5 అంగుళాల తాకే తెర
* 20 మెగా పిక్సెల్‌ ముందు కెమేరా
* 13 మెగా పిక్సెల్‌ వెనుక కెమేరా
* 4 జీబీ ర్యామ్‌
* 64 జీబీ అంతర్గత మెమొరీ
* 256 జీబీ వరకూ మెమొరీ పెంచుకునే సామర్థ్యం
* 64బిట్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌
* ఆండ్రాయిడ్‌ మార్ష్‌మాలో
* 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

వందేళ్లు దాటినా.. వంటలు అదుర్స్‌!డాక్యుమెంటరీ చేయనున్న బీబీసీ! దేశవిదేశాల్లో అభిమానులు! లక్షల్లో చందాదారులు!గుడివాడ.... ...
27/04/2017

వందేళ్లు దాటినా.. వంటలు అదుర్స్‌!

డాక్యుమెంటరీ చేయనున్న బీబీసీ!
దేశవిదేశాల్లో అభిమానులు!
లక్షల్లో చందాదారులు!

గుడివాడ.... తెనాలికి పది కిలోమీటర్ల దూరంలో ఉందీ చిన్న పల్లెటూరు. ఆ గ్రామ ప్రజలకి కృష్ణమ్మ పరవళ్లు తప్ప... ప్రపంచం తెలియదు. అసలు యూట్యూబ్‌ అంటే ఏంటో కూడా తెలియదు. అలాంటి వూరు ఇప్పుడు వందేళ్లు పైబడిన ఓ బామ్మ వల్ల యావత్‌ ప్రపంచానికి తెలిసింది. ప్రపంచ ప్రఖ్యాత ఛానల్‌ అయిన బీబీసీని సైతం ఆ వూరికి రప్పించింది. ఆ బామ్మ ఎవరో కాదు కంట్రీఫుడ్స్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో పొలం గట్ల మధ్య కట్టెల పొయ్యి మీద సంప్రదాయ వంటలు చేస్తున్న కర్రె మస్తానమ్మ. ఈనెల పదో తారీఖున నూట ఆరో పుట్టినరోజు జరుపుకొన్న ఈ బామ్మ గురించి మరిన్ని ఆసక్తికర విశేషాలివిగో..



వంటల కార్యక్రమాలంటే ఎలా ఉంటాయి... ఆధునిక వసతులున్న ఏసీ గదుల్లో చెఫ్‌లు వండుతుంటారు. వ్యాఖ్యాత తయారీని వివరిస్తుంటుంది. లేదంటే ఆసక్తి ఉన్న ఔత్సాహికులు తమకు తెలిసిన వంటల్ని వండి చూపిస్తుంటారు. నిజానికి మనం ఆ వంటల కార్యక్రమాలు చూస్తామే గానీ.. చాలా పదార్థాలు మనకు తెలియవు. ఒకవేళ తెలిసినా ఎక్కడ అమ్ముతారో తెలియదు. అయినా కొత్త కాబట్టి మనకు కాస్త వింతగానే ఉండి చూసేస్తుంటాం కదా! ఈ బామ్మ మాత్రం.. ఎలాంటి సౌకర్యాలు లేకుండా పచ్చని చెట్టు కింద.. పొలం గట్టుపై కట్టెల పొయ్యి మీదే సంప్రదాయ వంటల్ని వండుతూ.. ఈతరానికి ఆ పదార్థాల్ని పరిచయం చేస్తోంది. కుక్కర్లు, మిక్సీలు ఏమీ ఉండవు. వంటకాల్లో వాడేవన్నీ మనకు ఇంట్లో దొరికేవే. ఉప్పు, కారం, మసాలాలు వేయాలంటే ప్రత్యేకంగా కొలతలూ, అందుకు చెంచాలూ అవసరం లేదామెకి. అనుభవంతో ఉజ్జాయింపుగా వేస్తుంది. దాదాపు ఆరు నెలల్లో ఆమ్లెట్‌, రొయ్యలూ, పీతలూ, దోసకాయ చికెన్‌, బ్రెడ్‌ ఆమ్లెట్‌ వంటి వంటకాలెన్నో తనదైన శైలిలో చేసి చూపింది. అందుకే దేశ విదేశాల్లోని 42 మిలియన్ల మంది వాటిని చూశారు. ఆ ఛానల్‌కి రెండున్నర లక్షల మందికిపైనే చందాదారులుగా మారిపోయారు. నూట ఆరేళ్ల ఈ బామ్మకి దేశవిదేశాల్లో అభిమానులున్నారు. చీరలూ, గ్రీటింగు కార్డులు పంపుతున్నారు. సన్మానం చేస్తామని ఆహ్వానం అందిస్తున్నారు. అదంతా ఈ బామ్మ చేతివంట మహత్యమే.
అద్దాల్లేకుండానే: మస్తానమ్మ నిన్న మొన్నటి వరకూ పొలం పనులు చేసుకునేది. ఇప్పటికీ చూపు బాగా కనిపిస్తుంది. కూరగాయలు కోసినా, వంటలు వండి వార్చినా కళ్లద్దాలు అవసరం లేదు. చురుగ్గా ఉంటుంది. చకచకా నడుస్తుంది. వంటలు చేసేటప్పుడు ఆమె కూరగాయలు కత్తిపీటతో కోస్తుంది. చేస్తూనే వాటి గురించి చెబుతుంటుంది. మస్తానమ్మ పుట్టి పెరిగిందీ, అత్తారి వూరు గుడివాడే. ఆమె ఆ వూరు సరిహద్దులు దాటి బయటకు వెళ్లింది చాలా అరుదు. పదకొండేళ్ల వయసులోనే పెళ్లైంది. ఐదుగురు పిల్లలు. నలుగురు పిల్లలు అనారోగ్యంతో చనిపోతే ఒక్క కొడుకు మిగిలాడు. భర్త కూడా ఇరవైరెండేళ్లకే దూరమయ్యాడు. అప్పట్నుంచీ వ్యవసాయ కూలీగా చేస్తూ కొడుకును పెంచింది. కొడుకు, కోడలు, మనుమలు ఉన్నా... తన భర్తతో కలిసి ఒకప్పుడు ఉన్న పూరి గుడిసెలోనే ఒంటరిగా ఉంటుంది. పొలం పనులకెళితే వచ్చే కూలి డబ్బులూ, వృద్ధాప్య పింఛనుతోనే జీవితం వెళ్లదీసేది.
రుచి చూశాకే ఆలోచన: ఏడు నెలల క్రితం ఆమె మనవడు లక్ష్మణ్‌ స్నేహితుడు శ్రీనాథ్‌రెడ్డితో కలిసి బామ్మని చూడటానికి వెళ్లాడు. మనవడు వచ్చాడని తానే స్వయంగా టొమాటో కూర చేసి అన్నం వండి పెట్టింది. ఆ వయసులో ఆమె చాకు కూడా లేకుండా టొమాటోను ముక్కలుగా కోయడం, వేళ్లతో అల్లం పొట్టు తీయడం వంటివి వారికి ఆసక్తిగా అనిపించాయి. పైగా కూరకూడా అద్భుతమైన రుచి. దాంతో వారి మనసులో మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఆమె చేత ఆరుబయట వంట చేయించి యూట్యూబ్‌లో పెడితే బాగుంటుందని అనుకున్నారు. అదే విషయం మస్తానమ్మని అడిగారు. ‘పాత కాలం వంటలు మీకేం నచ్చుతాయి నాయనా’ అంటూ బోసి నోటితో నవ్వేసింది. అయినా వాళ్లిద్దరూ వదలకుండా ఆమెతో పల్లెటూరి పద్ధతితో బెండకాయ కూర చేయించారు. అదే మొదటి వీడియో. దానికి విపరీతమైన స్పందన వచ్చింది. అలా వెంట వెంటనే మస్తానమ్మ చేత వంటలు చేయించి కంట్రీ ఫుడ్స్‌ అనే ఛానల్‌ ద్వారా పోస్ట్‌ చేయడం మొదలుపెట్టారు. వండి వార్చడంలో ఎంతో అనుభవం ఉండటంతో పొయ్యి దగ్గర కూర్చుని చకచకా చేసేస్తుంది. ఆమె చేసిన అరవై శాకాహార, మాంసాహార వంటల్లో పుచ్చకాయ చికెన్‌కు బాగా స్పందన వచ్చింది. నెలరోజుల్లో ఆరులక్షల మంది చూశారు. అలానే బెండకాయ, బ్రెడ్‌ ఆమ్లెట్‌, రోస్టెడ్‌ ప్రాన్స్‌నూ ఎక్కువ మందే వీక్షించారు.
ఎల్లలు దాటిన అభిమానం: ఈ వంటలను భారతీయుల తరవాత అమెరికా, జర్మనీ, ఇంగ్లండ్‌, పాక్‌లో ఉన్న ప్రవాస భారతీయులతోపాటు, విదేశీయులూ చూస్తున్నారు. వారంతా బామ్మ వంటలకి ఫిదా అవ్వడమే కాదు మొన్న ఆమె పుట్టిన రోజుసందర్భంగా పాక్‌ నుంచి ఫ¾ర్హాన్‌ అనే ఓ అభిమాని చీర, గ్రీటింగ్‌ కార్డు పంపాడు. అది చూసుకుని మస్తానమ్మ ఎంతగానో మురిసిపోయింది. ఆమెరికా, న్యూజిలాండ్‌ నుంచి కొన్ని భారతీయ కుటుంబాలు ఆమెను సన్మానించడానికి ఏర్పాట్లు చేస్తున్నాయి. లండన్‌కి చెందిన బార్‌ క్రాఫ్ట్‌ అనే ఛానల్‌ నుంచి కొందరు వచ్చి ఈ మధ్యనే మస్తానమ్మ జీవనశైలిని డాక్యుమెంటరీగా తీసుకుని వెళ్లారు. బీబీసీ కూడా అదే పనిలో ఉంది. ఇక ఈ వంటలను చూసేవారిలో యువతులే ఎక్కువ. వారు తిరిగి ఇదే వంటలను ప్రయత్నించి వీడియోలు తీసి బామ్మ వంటకి కామెంట్‌గా పోస్టు చేస్తున్నారు. అంతేకాదు కొత్త వంట ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసే జాబితాలోనూ వారున్నారంటే నమ్ముతారా!

మీ టీవీనిలా... మార్చేయండి స్మార్ట్‌గా!ఇంట్లో ఎల్‌ఈడీ టీవీ పాతదైపోయింది... కొత్తది తీసుకుందామండీ! స్మార్ట్‌ టీవీలు వచ్చాయ...
27/04/2017

మీ టీవీనిలా... మార్చేయండి స్మార్ట్‌గా!

ఇంట్లో ఎల్‌ఈడీ టీవీ పాతదైపోయింది... కొత్తది తీసుకుందామండీ! స్మార్ట్‌ టీవీలు వచ్చాయంట... చాలా బాగున్నాయంటున్నారు! మీ ఇంట్లోనూ ఇలాంటి ప్రతిపాదనలు వస్తున్నాయా? కొత్త ఆప్షన్లతో వస్తున్న టీవీ అంటే అందరికీ ఆసక్తే మరి... అందులోనూ అంతర్జాలం సాయంతో పని చేసేవంటే ఇంకా ఆసక్తి! అయితే స్మార్ట్‌ టీవీ కోసం మీ టీవీని అమ్మేసి కొత్తది కొనక్కర్లేదు. మీ పాత ఎల్‌ఈడీ/ఎల్‌సీడీ టీవీకి ‘స్టిక్స్‌’ జోడిస్తే సరి. ఎంచక్కా మీ ఇంట్లో స్మార్ట్‌ టీవీ చూసేయొచ్చు!

కోహ్లీ బెంగళూరుకు చావో రేవో గుజరాత్‌ లయన్స్‌తో రెండో పోరు ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పదో సీజ...
27/04/2017

కోహ్లీ బెంగళూరుకు చావో రేవో
గుజరాత్‌ లయన్స్‌తో రెండో పోరు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పదో సీజన్‌లో దురదృష్టం వెంటాడుతున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నేడు గుజరాత్‌ లయన్స్‌తో రెండో సమరానికి సిద్ధమైంది. సీజన్‌లో ఏడు మ్యాచ్‌లాడిన గుజరాత్‌ రెండు విజయాలతో పట్టికలో అట్టడుగు స్థానంలో ఉండగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌ వర్షార్పణం కావడంతో దిగాలుపడ్డ కోహ్లీసేన 5 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. ఆ జట్టు ఇక అన్ని మ్యాచ్‌లు గెలిచినా ప్లేఆఫ్‌ చేరుకోవడం కష్టమే అని విశ్లేషకుల అభిప్రాయం. మిగిలిన మ్యాచ్‌ల్లో మిగతా జట్ల ప్రదర్శనను బట్టే కోహ్లీసేన భవితవ్యం ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో గుజరాత్‌ లయన్స్‌తో జరిగే మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి బెంగళూరుది.
బెంగళూరుదే పై చేయి
సీజన్‌లో తలపడ్డ తొలిమ్యాచ్‌లో బెంగళూరు నిర్దేశించిన 214 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్‌ ఛేదించలేకపోయింది. ఈ రెండు జట్లు ఐపీఎల్‌లో నాలుగు సార్లు తలపడగా మూడు సార్లు కోహ్లీసేనదే విజయం. ఆర్‌సీబీ ఆ మూడుసార్లు 180, 248, 213 స్కోర్లు చేసింది. ఆల్‌రౌండర్‌ డ్వేన్‌బ్రావో టోర్నీ నుంచి నిష్క్రమించడంతో గుజరాత్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌తో ఒప్పందం కుదుర్చుకొంది. అతడు ఈ మ్యాచ్‌లో ఆడేది సందేహమే. ప్రస్తుతం వూపుమీదున్న బ్రెండన్‌ మెక్‌కలమ్‌కు టీ20ల్లో బెంగళూరు స్పిన్నర్లు శామ్యూల్‌ బద్రీ (34 బంతుల్లో 26, 2 సార్లు ఔట్‌), చాహల్‌ (23 బంతుల్లో 20, 3 ఔట్లు)పై మంచి రికార్డు లేదు. ఈ మ్యాచ్‌లో బద్రీ ఆడకపోతే నేగీని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అమ్మో.. డివిలియర్స్‌, కోహ్లీ
గుజరాత్‌ లయన్స్‌పై విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌కు మంచి రికార్డు ఉంది. వీరిపై కోహ్లీ సగటు 91, స్ట్రైక్‌రేట్‌ 160.58. ఇక డివిలియర్స్‌ సగటు 228, సగటు 198.26 కావడం గమనార్హం. లయన్స్‌కు పవర్‌ప్లే ఓవర్లలో చెత్త ఎకానమీ (9.80) ఉండటంతో వీరిద్దరూ విరుచుకుపడే అవకాశం ఉంది. గుజరాత్‌ స్పిన్నర్‌ రవీంద్ర జడేజా సైతం ఆశించిన రీతిలో వికెట్లు తీయడం లేదు. ఈ సీజన్‌లో క్రిస్‌గేల్‌ ఫామ్‌లో లేడు. పవర్‌ప్లేలో ఆడిన 70 బంతుల్లో 69 పరుగులే చేశాడు. అందులో 61.5% డాట్‌బాల్స్‌ కావడం గమనార్హం. బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న రెండు జట్ల సమరంలో ఎవరు బాగా బౌలింగ్‌ చేస్తారో వారినే విజయం వరించనుంది.

24/04/2017
‘డీజే’ వచ్చేస్తున్నాడోచ్‌! హైదరాబాద్‌: స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘దువ్వాడ జగన్నాథమ...
22/04/2017

‘డీజే’ వచ్చేస్తున్నాడోచ్‌!

హైదరాబాద్‌: స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘దువ్వాడ జగన్నాథమ్‌’ (డీజే). ఈ సినిమా జూన్‌ 23న విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని అల్లు అర్జున్‌తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా వెల్లడిస్తూ పోస్టర్‌ను షేర్‌ చేశారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దే కథానాయికగా నటిస్తోంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రత్యర్థులకు హైరాణా ధర లక్షల్లో.. ఆట కోట్లల్లో! నితీశ్‌ రాణా.. ఇప్పుడు ఐపీఎల్‌ అభిమానుల నోళ్లలో నానుతున్న పేరిది. ముంబయ...
22/04/2017

ప్రత్యర్థులకు హైరాణా
ధర లక్షల్లో..
ఆట కోట్లల్లో!

నితీశ్‌ రాణా.. ఇప్పుడు ఐపీఎల్‌ అభిమానుల నోళ్లలో నానుతున్న పేరిది. ముంబయి ఇండియన్స్‌ ఎంతటి లక్ష్యాన్నయినా అలవోకగా ఛేదించేస్తూ వరుస విజయాలతో దూసుకెళ్లిపోతోందంటే అందుకు ప్రధాన కారణం రాణానే. ఈ సీజన్లో రాణా వూపు చూసి.. ఇన్నాళ్లూ ఇతనెక్కడున్నాడో అని అందరూ అనుకుంటున్నారు కానీ.. అతను ముంబయి జట్టుతోనే మూడేళ్లుగా ఉంటున్న సంగతి చాలామందికి తెలియదు. ఈ ఐపీఎల్‌ ఆడటానికి ముందు విజయ్‌ హజారె ట్రోఫీలో అతను ఘోరంగా విఫలమయ్యాడు. దిల్లీ జట్టులో చోటు కూడా కోల్పోయాడు. అలాంటి వాడు.. ఐపీఎల్‌లో అవకాశం దక్కించుకోవడం, అదిరిపోయే ప్రదర్శనతో లీగ్‌కే ఆకర్షణగా మారడం ఆశ్చర్యమే!
ఈనాడు క్రీడావిభాగం
అది ముంబయి ఇండియన్స్‌-కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మ్యాచ్‌. ఐపీఎల్‌ పదో సీజన్లో అప్పటికే ఒక మ్యాచ్‌ ఓడి ఒత్తిడిలో ఉంది ముంబయి. సొంతగడ్డపై జరుగుతున్న తర్వాతి మ్యాచ్‌లో నెగ్గి గెలుపు బాట పట్టాలని ఆశతో ఉన్న ఆ జట్టు ముందు 179 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. ఐతే ఛేదనలో 10 ఓవర్లకు ఆ జట్టు రోహిత్‌ శర్మ సహా మూడు కీలక వికెట్లు కోల్పోయి 74 పరుగులే చేసింది. సాధించాల్సిన రన్‌రేట్‌ అంతకంతకూ పెరిగిపోతోంది. మరోవైపు వికెట్లూ నిలవట్లేదు. దీంతో ముంబయికి వరుసగా రెండో ఓటమి ఖాయమని అందరూ ఓ అంచనాకు వచ్చేశారు. కానీ అప్పుడే చెలరేగిపోయాడు 23 ఏళ్ల నితీశ్‌ రాణా. బంతిని బలంగా బాదుతూ.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. అతడి పేరు.. నేపథ్యమేంటో తెలుసుకునే లోపే మెరుపు వేగంతో అర్ధశతకం పూర్తి చేసేశాడు. ఒక్కసారిగా మ్యాచ్‌ ముంబయి వైపు మొగ్గింది. అంతిమంగా విజయం కూడా ఆ జట్టునే వరించింది. ఆ ఒక్క ఇన్నింగ్స్‌ చూస్తే తెలిసిపోతుంది.. రాణా ఎంత విలువైన ఆటగాడో! ఐతే ఆ ఇన్నింగ్స్‌ గాలివాటమేమీ కాదని తర్వాత మరిన్ని మెరుపులతో రుజువు చేశాడు నితీశ్‌. సన్‌రైజర్స్‌పై 45 పరుగులు (36 బంతుల్లో).. గుజరాత్‌పై 53 పరుగులు (36 బంతుల్లో).. తాజాగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై 62 పరుగులు (34 బంతుల్లో).. ఇలా దేనికదే ప్రత్యేకమైన, విలువైన ఇన్నింగ్సే. ఇవన్నీ కూడా ఛేదనలో ఒత్తిడి మధ్య సాధించినవే. ప్రస్తుతం లీగ్‌లో రెండో అత్యధిక పరుగుల వీరుడు అతనే. ఐపీఎల్‌ అనగానే చాలామంది కుర్రాళ్లు అడ్డదిడ్డంగా షాట్లు ఆడటం.. కొత్త షాట్లు ప్రయత్నించడం చేస్తుంటారు. ఐతే రాణా అలా ఆడడు. అతడి షాట్లన్నీ దాదాపుగా సంప్రదాయ తరహాలోనే ఉంటాయి. టైమింగ్‌, శక్తి కలగలిపి ఎలాంటి బంతినైనా అలవోకగా స్టాండ్స్‌లోకి పంపగల నైపుణ్యం అతడి సొంతం. కోల్‌కతా, సన్‌రైజర్స్‌ లాంటి బలమైన బౌలింగ్‌ దళాలున్న జట్లపైనా మెరుపులు మెరిపించాడు నితీశ్‌. తాజాగా కింగ్స్‌ ఎలెవన్‌పై అతను ఒక్క ఫోర్‌ కూడా కొట్టలేదు. సిక్సర్ల మోతే మోగించాడు. ఏకంగా 7 సిక్సర్లు బాదేశాడు.
పది లక్షలకు సొంతమై..: దిల్లీకి చెందిన రాణా 2015లోనే ఐపీఎల్‌ అవకాశం దక్కించుకున్నాడు. అతడిని రూ.10 లక్షల కనీస ధరకు ముంబయి కొనుక్కుంది. ఐతే ఆ సీజన్లో రాణాకు మ్యాచ్‌ ఆడే అవకాశమే దక్కలేదు. గత సీజన్లో నాలుగు మ్యాచ్‌లు ఆడి, వందకు పైగా పరుగులతో పర్వాలేదనిపించాడు నితీశ్‌. ఐతే ఈ సీజన్లో అతడికి నేరుగా తుది జట్టులో చోటు దక్కడం ఆశ్చర్యమే. ఎందుకంటే ఐపీఎల్‌కు ముందు జరిగిన దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారె ట్రోఫీలో అతను ఘోరంగా విఫలమయ్యాడు. మూడు మ్యాచ్‌ల్లో కలిపి పది పరుగులే చేశాడు. దీంతో అతడిపై దిల్లీ జట్టు వేటు వేసింది. ఐతే దిల్లీ కెప్టెన్‌ గంభీర్‌ మాత్రం అతడిపై భరోసా ఉంచాడు. రాణాపై వేటు వేయడంలో కీలక పాత్ర పోషించిన కోచ్‌ భాస్కర్‌పై విమర్శలు గుప్పించాడు. కష్టకాలంలో రాణాకు మద్దతుగా నిలిచాడు. గంభీర్‌ సలహాలతో రాణా ఆట మెరుగుపడటమే కాదు.. అతడిలో ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. తనేంటో రుజువు చేసుకోవడానికి ఐపీఎల్‌ రూపంలో అతడికి చక్కటి అవకాశం దొరికింది. విశేషం ఏంటంటే.. రాణా ఏంటో అందరికీ తెలిసింది గంభీర్‌ నేతృత్వంలోని నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లోనే. రాణా వల్ల తన జట్టు ఓడినప్పటికీ.. తాను నమ్మకం పెట్టిన ఆటగాడు అలా రాణించడం గంభీర్‌కు సంతోషాన్నే ఇచ్చి ఉంటుందనడంలో సందేహం లేదు. కేవలం పది లక్షలకు ముంబయి సొంతమైన రాణా.. ఇప్పుడు కోట్ల విలువైన ఆటతో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు.

ఉద్యోగాలను సృష్టిస్తాయి.. తీసుకెళ్లవు..! అమెరికా సహా ఏ ఇతర దేశాల్లోనైనా భారత ఐటీ కంపెనీలు ఉద్యోగాలను సృష్టిస్తాయి గానీ, ...
22/04/2017

ఉద్యోగాలను సృష్టిస్తాయి.. తీసుకెళ్లవు..!

అమెరికా సహా ఏ ఇతర దేశాల్లోనైనా భారత ఐటీ కంపెనీలు ఉద్యోగాలను సృష్టిస్తాయి గానీ, తీసుకెళ్లిపోవని కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. బెంగళూరులో భారత ఐటీ రంగ ప్రతినిధులతో శనివారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. మల్టీనేషనల్‌ కంపెనీలు పెద్దస్థాయిలో వ్యాపారం చేసి ఉంటే అందులో భారతీయుల భాగస్వామ్యం కచ్చితంగా ఉంటుందన్నారు. ఇది పరస్పర అవగాహనతోనే సాధ్యమవుతుందన్నారు. భారతీయ ఐటీ కంపెనీలకు ప్రపంచ వ్యాప్తంగా ఎదురులేదని, ఇప్పుడు ‘డిజిటల్‌ ఇండియా’తో విస్తృత మార్కెట్‌ ఏర్పడిన దృష్ట్యా తిరిగి భారత్‌లో సేవలను విస్తరిస్తున్నాయి అని అన్నారు.
హెచ్‌-1బీ వీసాల విధానంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కఠిన వైఖరి అనుసరిస్తున్న సంగతి తెలిసిందే. వీసాల జారీ ప్రక్రియలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు అధికారిక ఉత్తర్వు కూడా జారీ చేశారు. అమెరికన్లకు రావాల్సిన ఉద్యోగాలను విదేశీయులు ముఖ్యంగా భారత్‌ వంటి దేశాలు తన్నుకుపోతున్నాయని ట్రంప్‌ ఆరోపిస్తున్నారు.

Address

Bhanugudi
Kakinada
533001

Telephone

8121213555

Website

Alerts

Be the first to know and let us send you an email when Kvrinfraa projects posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share