Tentu Srinuvas Camera Man

Tentu Srinuvas Camera Man Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Tentu Srinuvas Camera Man, Real Estate, Visakhapatnam.

Simhachalam Devasthanam
24/10/2025

Simhachalam Devasthanam

28/11/2024

శ్రీ నృసింహ దీక్షలు"

04/10/2024

ప్రెస్ నోట్
శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం, విశాఖపట్నం జిల్లా,
తేది.04.10.2024 నుండి తేది.12.10.2024 వరకు శ్రీ స్వామి వారి సన్నిధిలో శరన్నవరాత్రి
ఉత్సవములు సందర్భముగా స్వామి వారి దేవాలయములో ప్రతి రోజు విశేష ఉత్సవములు
జరుగును. తేదీ.04.10.2024 నుండి తేది.12.10.2024 వరకు శ్రీ స్వామి వారి సన్నిధిలో
శ్రీ రామాయణ నవరాత్రి పారాయణం ప్రారంభమగును, మరియు తేది.04.10.2024 నుండి
తేది.12.10.2024 వరకు ప్రతి రోజు సాయంత్రం గం..5.00 లకు శ్రీ చతుర్భుజ తాయర్, శ్రీ సువర్ణ
అమ్మవార్ల బేడా తిరువీధి ఉత్సవము జరుగును. మరియు తేది.09.10.2024 నుండి
తేది.13.10.2024 వరకు శ్రీ తాయర్ల సన్నిధిలో శ్రీ వీరలక్ష్మి ఆరాధనం (మూలపూజలు) ఆయుధ
పూజలు జరుగును. మరియు తేది.13.10.2024 న విజయ దశమి సందర్భముగా శ్రీ స్వామి వారి
కొండ పై నుండి మధ్యాహ్నం గం..3.30 ని..లకు ఉత్సవమూర్తులను గోవిందరాజ స్వామి
రామఅవతరంలో భక్తులకు దర్శనములు కల్పించుటకు మెట్ల మార్గం ద్వారా కొండ దిగువ గల
పూలతోటకు వేంచేయుదురు. సదరు పూలతోట నందు సాయంత్రం "జమ్మివేట మహోత్సవము"
అత్యంత వైభవముగా జరుగును. కావున గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి జమ్మివేట
మహోత్సవము" నందు గ్రామతిరువీధి ఉత్సవము నందు పాల్గొని శ్రీ స్వామి వారి తీర్ధ ప్రసాదములు
స్వీకరించవలసినదిగా కోరడమైనది.
తేది.13.10.2024 న విజయ దశమి సందర్భముగా సాయంత్రం గం.6.00ల తరువాత
శ్రీ స్వామి వారి దర్శనములు భక్తులకు లభించవు. తిరిగి తేది. 14.10.2024 న ఉదయం గం.6.30
ని..లనుండి యధావిధిగా శ్రీ స్వామి వారి దర్శనములు భక్తులకు లభించునని తెలియజేయడమైనది.
కావున పైన తెలియబరచిన ప్రకారం శ్రీ స్వామి వారి ఉత్సవమునకు సంబందించిన
వివరములు మీ యొక్క దినపత్రిక టి.వి.ల ద్వారా భక్తులకు తెలియజేయవలసినదిగా కోరడమైనది.

రావమ్మ దుర్గమ్మ తల్లీ రావమ్మా,మా జీవలోగిలికి ప్రాణదీపమై వుండంగా,నీ పదముల దాసులకు శుభములు చేకూర్చంగా,చల్లని నీచూపులతో మనస...
04/10/2024

రావమ్మ దుర్గమ్మ తల్లీ రావమ్మా,
మా జీవలోగిలికి ప్రాణదీపమై వుండంగా,
నీ పదముల దాసులకు శుభములు చేకూర్చంగా,
చల్లని నీచూపులతో
మనసు విరహాన్ని తీర్చంగా,
పల్లకీ రాగాలను ఆలకిస్తూ
రావమ్మా దుర్గమ్మ తల్లీ రావమ్మా.
ప్రతి హృదయం
నీ జప తపాలతో నిండంగా,
ప్రతి పలుకు నీధ్యానమే అవ్వంగా,
ఆలోచన లోతుల్లో
నీ ఆరాధనే నిలవంగా,
విజయదశమి 'విజయా'నందంతో నింపంగా
రావమ్మా దుర్గమ్మతల్లీ రావమ్మా.
దివ్యశక్తి ప్రేమతో ప్రతిమనసు కదలంగా,
పూజకు భక్తితో మామదినే అర్పించంగా,
సర్వస్వము తేటపరచు
శక్తిమాతే నీవుగా,
అభయమిచ్చి దారిచూపు
ఆనందదీపమై
రావమ్మా దుర్గమ్మ తల్లీ రావమ్మా.

ఫోటోగ్రాఫర్ తెంటు శ్రీనివాస్ ప్రతిభకు మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. సింహాగిరిపై నృసింహాస్వామి పసుపు కొట్నం ఉత్సవం...
02/10/2024

ఫోటోగ్రాఫర్ తెంటు శ్రీనివాస్ ప్రతిభకు మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. సింహాగిరిపై నృసింహాస్వామి పసుపు కొట్నం ఉత్సవం సందర్భంగా తీసిన ఫోటోకు అవార్డు వరించింది. స్వామి వారి వార్షిక తిరుకళ్యాణోత్సవం సందర్భంగా తెంటు శ్రీనివాస్ తీసిన ఫోటో మండలి వెంకట కృష్ణారావు మెమోరియల్ అవార్డు గెల్చుకుంది. ఈ పోటీలను ఏపీ స్టేట్ క్రియేటివ్ అండ్ కల్చర్ కమిషన్ ఆధ్వర్యంలో ఇండియా ఇంటర్నేషనల్ ఫొటో గ్రాఫిక్ కౌన్సిల్(ఐఐపీసీ),
ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా(పీఏఐ) సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహించాయి.

02/10/2024
తెంటూ శ్రీనివాస్ కు ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ 'డెడికేటెడ్ జర్నలిస్ట్ పురస్కార్'-2024 విశాఖపట్నం:ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ...
30/09/2024

తెంటూ శ్రీనివాస్ కు ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ 'డెడికేటెడ్ జర్నలిస్ట్ పురస్కార్'-2024

విశాఖపట్నం:ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ "మీడియా అవార్డ్స్ - 2024"లో భాగంగా నగరానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ 'తెంటూ శ్రీనివాస్ కు డెడికేటెడ్ జర్నలిస్ట్ పురస్కార్-2024' అతిథులచే అందుకున్నారు. డాబాగార్డెన్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఆదివారం అంగరంగ వైభవంగా జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో తెంటూ శ్రీనివాస్ తో పాటు పలువురు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు, సంపాదకులు, ఫోటో, వీడియో జర్నలిస్టులు మీడియా అవార్డులు అందుకున్నారు.
ఈ సందర్భంగా స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ సoస్థ ఇంటర్నేషనల్ కొరియోగ్రాఫర్ ఆర్.నాగరాజ్ పట్నాయక్ ఏర్పాటుచేసిన పలు సాంస్కృతిక కళా ప్రదర్శనలు అలరించాయి.దేశ విదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చిన ప్రఖ్యాత కళాకారులు, డ్యాన్స్ మాస్టర్ లకు నిర్వాహకులు జ్ఞాపిక ప్రశంసా పత్రం అందించి దుస్సాలువా కండువాలతో ఘనంగా సత్కరించారు.ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సినీ నిర్మాత కంచర్ల అచ్యుతరావు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, సీనియర్ జర్నలిస్ట్, ప్రోగ్రామ్ ఆర్గనైజర్
ఆర్ నాగరాజు పట్నాయక్, బ్రహ్మకుమారిస్ విశ్వవిద్యాలయం ప్రతినిధి రామేశ్వరి, ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ మేనేజర్ సుధీర్
ఇతర ప్రముఖులచే పాత్రికేయులు, కళాకారులు అవార్డులు, జ్ఞాపికలు అందుకున్నారు.

Address

Visakhapatnam
530027

Alerts

Be the first to know and let us send you an email when Tentu Srinuvas Camera Man posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Tentu Srinuvas Camera Man:

Share

Category